తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాగార్జున యూనివర్శిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో గుంటూరు కోర్టు తీర్పు వెలువడింది. విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న తొమ్మిదేళ్ల తర్వాత గుంటూరు జిల్లా న్యాయస్థానం కేసు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.రిషితేశ్వరి కేసుపై న్యాయస్థానం తీర్పు తర్వాత బాధితురాలి తల్లితండ్రులు స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తల్లి దుర్గాబాయి మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లుగా పోరాడుతున్నామని, న్యాయం జరుగుతుందని భావించామన్నారు. తమకు న్యాయం జరగలేదంటూ ఇంకెవరికీ న్యాయం జరగదని ఆమె అభిప్రాయపడ్డారు. అప్పీల్కు వెళ్లాలా లేదా అనే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారు. ఇక పోరాడే ఓపిక లేదని ఆమో ఆవేదన వ్యక్తం చేశారు.రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ మాట్లాడుతూ.. రిషితేశ్వరి డైరీలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో అర్థం కావటం లేదన్నారు. డైరీలో అన్ని విషయాలు వివరంగా ఉన్నాయన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా రిషితేశ్వరే డైరి రాసినట్లు నివేదిక ఇచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
![]() |
![]() |