ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 03, 2024, 08:18 PM

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఏపీ రజక ఐక్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేంపెంట రాంబాబు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం కర్నూలు బీసీ భవనలో జరిగిన రజక ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రజకులు చాలీచాలని భత్యాలతో దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారని, మరికొన్ని చొట్ల గ్రామ బహిష్కరణలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ముఖ్య మంత్రి ఎన్టీఆర్‌ రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తూ కేబినెట్‌లో తీర్మాణం చేసి పార్లమెంటుకు పంపారని, కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వం అనివార్య కారణాలతో పడి పోవడంతో ఈ ప్రక్రియ ఆగిపోయిందన్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతూ బిల్లు అసెంబ్లీలో పెట్టి తీర్మాణం చేసి పార్లమెంటు బిల్లు ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ రజక ఐక్య సేవా సమితి కర్నూలు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు భారతి, కటారుకొండ సాయి కుమార్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa