డిసెంబర్ రెండో వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లో ఐపీఓల జాతర జరగనుంది. మెయిన్బోర్డ్, ఎస్ఎంఈ విభాగంలో కలిపి మొత్తంగా 11 కంపెనీల ఐపీఓలు సబ్స్క్రిప్షన్కి వస్తున్నాయి. ఈ సంస్థలన్నీ కలిపి ఏకంగా రూ.18,500 కోట్లు సమీకరించనున్నాయి. ఈ లెక్కతో ప్రస్తుత సంవత్సరంలో వచ్చిన పబ్లిక్ ఇష్యూల మొత్తం విలువ రూ.1.64 లక్షల కోట్లకుపైగా ఉండనుంది. వచ్చే ఏడాదిలోనూ ఐపీఓల హవా కొనసాగనుంది. ఈ వారం ఐపీఓకు వస్తున్న ప్రధాన కంపెనీల్లో హైదరాబాద్కు చెందిన ప్రముఖ కంపెనీ సాయి లైఫ్ సైన్సెస్ సైతం ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
హైదరాబాద్ కంపెనీ ఐపీఓ..
హైదరాబాద్ కేంద్రంగా ఫార్మసీ సేవలందిస్తున్న సాయి లైఫ్ సైన్సెస్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ డిసెంబర్ 11వ తేదీన ప్రారంభం కానుంది. బిడ్లు దాఖలు చేసేందుకు డిసెంబర్ 13వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.3,043 కోట్లు సమీకరించనుంది. ధరల శ్రేణి రూ.522 నుంచి రూ.549గా నిర్ణయించారు. తాజా షేర్ల జారీ ద్వారా రూ.950 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 3.8 కోట్ల షేర్లు జారీ చేయనుంది కంపెనీ.
విశాల్ మెగా మార్ట్..
ఈ వారం వస్తున్న కంపెనీల్లో విశాల్ మెగా మార్ట్ ఒకటి. మదుపరుల ప్రధాన దృష్టి ఈ కంపెనీపైనే ఉన్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం. తొలి పబ్లిక్ ఇష్యూ డిసెంబర్ 11న మొదలై 13వ తేదీతో ముగుస్తుంది. మార్కెట్ నుంచి రూ.8 వేల కోట్లు సమీకరించనుంది. ప్రైస్ బ్యాండ్ రూ.74 నుంచి రూ.78గా నిర్ణయించింది. ఒక్క లాట్ 190 షేర్లు ఉంటాయి. ఒక్కో లాట్కి రూ.14,820 వెచ్చించాల్సి ఉంటుంది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా షేర్లు కేటాయిస్తుంది.
ఇక ప్రధాన కంపెనీల్లో మొబిక్విక్ ఐపీఓ నిలుస్తోంది. డిసెంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు బిడ్లు దాఖలు చేయవచ్చు. ధరల శ్రేణి రూ.265-279గా ఉంది. రూ.572 కోట్లు సమీకరించనుంది. ఇక ఇన్వెంటరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ కంపెనీ ఐపీఓ డిసెంబర్ 12న మొదలై 16తో ముగుస్తుంది. ఇంటర్నేషనల్ జెమోలాజికల్ ఇన్స్టిట్యూట్ సంస్థ పబ్లిక్ ఇష్యూ డిసెంబర్ 13వ తేదీన మొదలై 17న ముగుస్తుంది. ప్రైస్ బ్యాండ్ ఇంకా ప్రకటించలేదు. ఆ తర్వాత ధనలక్ష్మి క్రాప్ సైన్స్ సంస్థ ఐపీఓ డిసెంబర్ 9న సబ్స్క్రిప్షన్ మొదలవుతుంది. ధరల శ్రేణి రూ.52 నుంచి రూ.54గా నిర్ణయించారు.
వీటితో పాటు జంగిల్ క్యాంప్స్, పర్పుల్ యూనిల్ సేల్స్, టాస్ ది కాయిన్, సుప్రీమ్ పెసిలిటీ మేనేజ్మెంట్, యష్ హైవోల్టేజ్ కంపెనీల ఐపీఓలు డిసెంబర్ రెండో వారంలో వస్తున్నాయి. మెయిన్ బోర్డుకు చెందిన ప్రాపర్టీ షేర్ పెట్టుబడి ట్రస్ట్ ఎస్ఎం ఆర్ఈఐటీ డిసెంబర్ 9వ తేదీన స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కానుంది. అయితే, ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. ఎలాంటి పెట్టుబడిని ప్రోత్సహించేందుకు కాదు. నిపుణుల సలహాలు తీసుకునే పెట్టుబడులు పెట్టడం మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa