అభిమాని హత్య కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన కన్నడ నటుడు దర్శన్కు భారీ ఊరట లభించింది. దర్శన్తోపాటు ఆయన ఫ్రెండ్ పవిత్ర గౌడ సహా మరికొందరికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని దర్శన్, పవిత్ర గౌడ.. అతి కిరాతకంగా చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారని ఆరోపించిన పోలీసులు వారిద్దరు సహా ఈ కేసులో మొత్తం 15 మందిని అరెస్ట్ చేశారు. జూన్ 11వ తేదీన దర్శన్, పవిత్ర గౌడలను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్శన్కు ఇప్పటికే తాత్కాలిక బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి బయటికి వచ్చారు. ఆ తర్వాత రేణుకాస్వామి హత్య కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా ధర్మాసనం బెయిల్ ఇచ్చింది.
ఈ కేసులో దర్శన్తోపాటు అతడి స్నేహితురాలు పవిత్ర గౌడ సహా ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న మరో ఏడుగురికి కూడా కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ ఎస్ విశ్వజిత్ శెట్టి దర్శన్ బెయిల్ పిటిషన్లను విచారించి ఉత్తర్వులు వెలువరించారు. తన అభిమాని అయిన రేణుకాస్వామి.. తన స్నేహితురాలు పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్లు పంపించాడని.. తీవ్ర దుర్భాషలాలాడని.. అతడిని చిత్ర హింసలకు గురిచేసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా రేణుకాస్వామికి కరెంట్ షాక్ ఇవ్వడమే కాకుండా అత్యంత దారుణంగా కొట్టి తీవ్రంగా హింసించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సంచలన విషయాలను ఛార్జిషీట్లో పొందుపరిచారు.
ఇక ఈ రేణుకాస్వామి హత్య కేసులో ఇప్పటికే అనారోగ్య సమస్యల కారణంగా కోర్టు 6 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ దర్శన్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు.. దర్శన్కు భారీ ఉపశమనం కలిగించింది. దర్శన్ ప్రస్తుతం వెన్నునొప్పితో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇక ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురు నాగరాజు, అనుకుమార్, లక్ష్మణ్, జగదీష్ అలియాస్ జగ్గా, ఆర్ ప్రదూష్ రావులకు కూడా బెయిల్ మంజూరు అయింది. అయితే వీరందరికీ బెయిల్ మంజూరు చేస్తూనే కర్ణాటక హైకోర్టు పలు షరతులు విధించింది. కోర్టు అధికార పరిధిని విడిచిపెట్టి నిందితులు బయటికి వెళ్లకూడదని పేర్కొన్నారు. సాక్ష్యులను సంప్రదించొద్దని, వారిని భయపెట్టొద్దని కోర్టు ఆదేశించింది. ఇక మిగిలిన నిందితులు డిసెంబర్ 16వ తేదీన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
దర్శన్తో సన్నిహితంగా ఉంటున్న కారణంగా పవిత్ర గౌడకు రేణుకాస్వామి అసభ్యకరమైన మెసేజ్లు పంపించారని.. అందుకే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు. చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసిన దర్శన్ అనుచరులు.. అతడిని బెంగళూర్లోని కామాక్షి పాళ్య ప్రాంతంలోని షెడ్లో బంధించారు. ఈ తర్వాత దారుణంగా దాడి చేసి హింసించడంతో అతను మరణించినట్లు పోలీసులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa