ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్ ట్రూ అప్‌ చార్జీలు తీసివేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 14, 2024, 03:57 PM

ట్రూ అప్‌ చార్జీలను రద్దు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రజలపై విద్యుత భారాలను తగ్గించాలని కోరుతూ శుక్రవారం కర్నూలు నగర పాలక పరిధిలోని 84, 85 సచివాలయాలు, 23వ వార్డు, 27వ వార్డు షరీననగర్‌, క్రిష్ణానగర్‌ ఐటీసీ వద్ద విద్యుత బిల్లులను దహనం చేసిన నిరసన తెలిపారు. ఈసందర్భంగా సీపీఎం నాయకుడు విజయ రామాంజనేయులు మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఎలాంటి చార్జీలు పెంచబోమని చెప్పి ప్రజలను పూర్తిగా మోసం చేసిందని ఆరోపించారు. వెంటనే పెంచిన విద్యుత, ట్రూప్‌ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు రమణమూర్తి, హుస్సేనబాషా, ఆర్‌.నరసింహులు, సీహెచ.సాయిబాబా, లక్ష్మయ్య పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa