కర్నూలు నగరంలో వీధి కుక్కల బెడద నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు నగర పాలక కమిషనర్ ఎస్.రవీంద్రబాబు అన్నారు. శుక్రవారం గార్గేయపురం డంప్ యార్డులోని కుక్కల సంతాన నియంత్రణ ఆపరేషన కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వీధి కుక్కల బెడద ఎక్కువ అయినట్లు ప్రజాప్రతినిదులు, ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు డంప్ యార్డులో ఉన్న కుక్కల సంతాన నియంత్రణ కేంద్రంలో ప్రతిరోజు 20 కుక్కలకు ఆపరే షన్లు చేయ డానికి సౌకర్యాలు ఉన్నాయన్నారు. అదనంగా మరో 15 కుక్క లకు అపరే షన్లు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందుకు సంబం ధించిన నిర్మాణాలను చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొం దించామన్నారు. వీటి నిర్వహణ కోసం యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా(ఏడబ్ల్యూబీఐ) మార్గదర్శకాలను పాటించా మన్నారు. అక్కడి నుంచి త్వరలో అనుమతులు వస్తాయన్నారు. వచ్చిన వెంటనే తొలి దశగా ప్రతి రోజు 20 కుక్కలకు ఆపరేషన్లు నిర్వహిస్తా మన్నారు. ఆయన వెంట వెటర్నరీ వైద్యులు డాక్టర్ మల్దన్న, డీఈఈ గంగాధర్ ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa