నెయ్యిని మనలో చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వేడి వేడి అన్నం, పచ్చడి కలుపుకుని కాస్తా నెయ్యి వేసి తింటే స్వర్గమే. అంతేకాకుండా వంటల్లో మంచి ఫ్లేవర్, టేస్ట్ రావడానికి నెయ్యి వాడుతుంటారు. అంతేకాకుండా నెయ్యితో చేసిన స్వీట్స్ మంచి టేస్ట్ ఇస్తాయి. ఇక, చిన్న పిల్లలకు నెయ్యిని తినిపిస్తుంటారు పెద్దలు. నెయ్యితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నెయ్యిలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ,డి, ఇ,కె, ఒమేగా -3, ఒమేగా-6 వంటి ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, లినోలిక్, బ్యుటిరిక్ యాసిడ్స్ వంటి పోషకాలు ఉన్నాయి. అలాంటి నెయ్యిలో వంటింట్లో దొరికే నల్ల మిరియాలు కలిపి తింటే బోలెడు లాభాలు ఉంటాయి.
నెయ్యి, నల్ల మిరియాలు దాదాపు ప్రతి భారతీయ వంటగదిలో ఉంటాయి. ఈ రెండింటినీ సాధారణంగా వంటల్లో ఉపయోగిస్తారు. ఇవి ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని కలిపి తింటే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. మిరియాల్లో కూడా విటమిన్-ఎ, విటమిన్-సి, కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఈ రెండూ అనేక రకాల ఆరోగ్య సంబంధిత సమస్యలను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఈ రెండింటి కాంబినేషన్ వల్ల కలిగే ప్రయోజనాలపై ఓ లుక్కేద్దాం.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది..
నెయ్యి, మిరియాలు కలిపి తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో.. చలికాలంలో రోగాల్ని తట్టుకునే శక్తి వస్తుంది. వాస్తవానికి ఈ రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి. దీంతో.. ఈ రెండింటి కాంబినేషన్ శరీరాన్ని అనేక రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
జీర్ణవ్యవస్థ మెరుగు..
నెయ్యి, మిరియాలు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. నల్ల మిరియాల్లో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాకుండా నెయ్యి కడుపుని శుభ్రపరుస్తుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్ను బయటకు పంపుతుంది. ఈ రెండింటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
జలుబు, దగ్గు నుంచి రిలీఫ్..
చాలా మంది చలికాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యల బాధపడతారు. ఇలాంటి వారికి ఈ రెండింటి కాంబినేషన్ బెస్ట్ రిలీఫ్ ఇస్తుంది. మిరియాలు గొంతు, ఛాతీలో పేరుకుపోయిన శ్లేష్మాన్ని క్లియర్ చేయడంలో సాయపడతాయి. ఈ రెండింటి వినియోగం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభించడమే కాకుండా.. గొంతు నొప్పి, వాపు నుంచి కూడా రిలీఫ్ వస్తుంది.
వాపును తగ్గిస్తాయి..
నెయ్యిలో మిరియాలు కలిపి తింటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో శరీరంలో మంట, వాపు సమస్య నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఈ రెండూ ఇన్ఫ్లమేషన్ను అడ్డుకుంటాయి. రెగ్యులర్గా ఈ రెండింటి కాంబినేషన్ వినియోగం వల్ల ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పులు, వాపు నుంచి రిలీఫ్ లభిస్తుంది.
బరువు తగ్గవచ్చు..
నెయ్యి, మిరియాలు కలిపి తినడం వల్ల బరువు తగ్గవచ్చు. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. దీంతో.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు వేగంగా కాలిపోతుంది. నల్ల మిరియాల్లో ఉండే పైపైరిన్ కొవ్వును విచ్చిన్నం చేయడంలో సాయపడుతుంది. ఇక, నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. దీంతో.. ఆకలిని నియంత్రించడంలో సాయపడుతుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు.
నెయ్యి, మిరియాల్ని ఎలా తీసుకోవాలి?
ఇందుకోసం ముందుగా మిరియాల్ని గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక చెంచా నెయ్యిలో చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తినండి. దీన్ని రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు అందుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa