ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల్లో గెలిచిన వారు అభివృద్ధికి కృషి చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 15, 2024, 09:49 AM

 కనిగిరి నియోజకవర్గంలో శనివారం జరిగిన నీటి స ంఘాల ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులు లేకుండా స్వచ్ఛందంగా కూటమి బలపరిచిన వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏ ఎన్నికలు నిర్వహించినా బెదిరిం పులతో ఏకగ్రీవంగా మార్చుకున్నారని గుర్తుచేశా రు. అలాంటి సంస్కృతి కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా అధికారుల ఎన్నికలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. నీటి సంఘాల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్మన్‌లకు అభినందనలు తెలిపారు.


గెలుపొందిన వారు చెరువులు అభివృద్దికి కృషి చేయాలని కోరారు. వారికి తన సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు.నియోజకవర్గంలో 58 సాగు నీటి సంఘాలు ఏకగ్రీవమయ్యా యి. కనిగిరి పెద్దచెరువు కింద తమ్మినేని ప్రసూన నీటి సం ఘం సొసైటీ చైర్మన్‌గా ఏకగ్రీ వంగా ఎన్నికయ్యారు. హను మంతునిపాడు మండలంలోని హాజీపురం చెరువు నీటి సం ఘం చైర్మన్‌గా కోటపాటి రమే ష్‌రెడ్డి, వెలిగండ్ల మండలంలోని వెదుళ్ళచెరువు నీటి సంఘం చై ర్మన్‌గా ముక్కు తిరుపతిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలోని 58 నీటి సంఘాలకు ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర బ లపరచిన కూటమి అభ్యర్దులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన చైర్మన్‌లు ఆయా మం డలపార్టీ నాయకులతో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రను మర్యాదరపూర్వకంగా కలసి కృతఙ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa