ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాలకట్ల బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 15, 2024, 09:50 AM

గుడ్లవల్లేరు, డోకిపర్రు భూ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. బేడీ ఆంజనేయస్వామి ఆల యం నుంచి స్వామికి చంద్రబాబు పట్టువస్త్రాలను తీసు కురాగా వేదపండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకుని సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతులను సీఎం అభినందించారు. అనంతరం ముఖ్యమంత్రికి ఆలయ వేద పండితులతో వేద ఆశీర్వచనాలు పలికారు.


కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతులు ఆయనకు వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని, స్వామి లడ్డూ ప్రసాదాన్ని బహుకరించారు. తర్వాత ఆలయం నుంచి బయటికి వచ్చిన సీఎం..నిర్వాహకుల గెస్ట్‌హౌ్‌సను సందర్శించేందుకు వెళ్లారు. గెస్ట్‌హౌ్‌సలోని సమావేశ మందిరం, మినీ థియే టర్‌, భోజన శాల, ముఖ్యమైన గదులను కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతులు ముఖ్యమంత్రికి చూపించారు. అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. గెస్ట్‌ హౌస్‌ నుంచి బయటికి వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ హెలికాప్టర్‌లో తిరిగి వెళ్లిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa