ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరగతిన ఆధార్‌ అనుసంధానం చేసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 15, 2024, 09:50 AM

ఆధార్‌ అనుసంధాన ప్రక్రియను ఆదివారంలోగా పూర్తి చేయాలని సచివాలయ సిబ్బందిని జీఎ్‌సడబ్ల్యూఎస్‌ విభాగ చిత్తూరు జిల్లా అధికారి రవికుమార్‌ ఆదేశించారు.లబ్ధిదారుల ఖాతాలకే నేరుగా రాయితీ సొమ్మును జమ చేసే విషయంలో జాతీయ చెల్లింపుల సంస్థ నిబంధనల మేరకు ఆధార్‌ అనుసంధానం చాలాచోట్ల జరుగలేదు. ఈ అప్డేషన్‌ ప్రక్రియను నెలరోజులుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది చేపట్టారు. జిల్లాలో 2,14,050 ఖాతాలకు ఆధార్‌ సంఖ్య అనుసంధానం కాలేదని నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) గుర్తించింది. వీటి అప్డేషన్‌కు ప్రభుత్వం గతనెల 4వ తేదీ నుంచి గడువు ఇచ్చింది. ఆ తర్వాత విడతలవారీగా గడువును పెంచుకుంటూ వెళ్ళింది.ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆదివారం లోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తాజా సమాచారం మేరకు 31 మండలాలు, ఐదు మున్సిపాలిటీల పరిధిలో చిత్తూరుజిల్లా 99.80 శాతం మేరకు అప్డేషన్‌ చేసింది. మొత్తం 2,14,050 ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం 2,13,670 పూర్తి కాగా, 19,392 మంది మృతిచెందినట్లు గుర్తించారు. ప్రస్తుతం 380 ఖాతాలు మాత్రమే అప్డేషన్‌ జరగాల్సి ఉంది. మండలాల వారీగా పుంగనూరు, పెనుమూరు, రొంపిచెర్ల, శ్రీరంగరాజపురం మండలాలు వందశాతం పూర్తిచేయగా, మిగిలిన 27 మండలాలు, ఐదు మున్సిపాలిటీల్లో 1 నుంచి 99 ఖాతాల అప్డేషన్‌ను ఆదివారంలోగా పూర్తిచేయాల్సివుంది. అత్యధికంగా చిత్తూరు మున్సిపాలిటీలో 99, బైరెడ్డిపల్లిలో 59, పులిచెర్లలో 51, గుడుపల్లిలో 31 కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa