టీడీపీ పార్టీలో కష్టపడి పని చేసిన వారికే పదవులు దక్కుతాయని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. పనితీరు ఆధారంగానే గుర్తింపు, పదవులు ఉంటాయని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. పార్టీలో ఊరికే ఉన్నామంటే కుదరదని, అలాంటి నేతలు ఎటువంటి పదవులు ఆశించకూడదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఉండవల్లిలోని తన వివాసంలో అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు.ప్రజలకు, పార్టీకి సేవ చేయకుండా 30-40 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నామంటూ నేతలు పదవులు కావాలని అడగడం ఏమాత్రం సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు. కష్టపడందే ఏదీ రాదనే విషయం ప్రతీ ఒక్కరూ గ్రహించాలని పార్టీ ముఖ్య నేతలకు సూచించారు. కొందరు ఎమ్మెల్యే అయిపోయామనో, పదవులు వచ్చేశాయనో పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రైనా, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు ఏది వచ్చినా అది కేవలం పార్టీ వల్ల మాత్రమే వచ్చాయనే విషయాన్ని నేతలు దృష్టిలో పెట్టుకోవాలని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa