ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరుపు సహజమే కానీ.. అండగా నిలబడిన వారిని మర్చిపోకూడదు : పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 15, 2024, 05:58 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆత్మార్పణ దినం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అమరజీవి పొట్టి శ్రీరాములుకి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్ కీలక వాఖ్యలు చేశారు. మనిషికి మరుపు సహజమేనన్న పవన్ కళ్యాణ్.. అయితే మనకు అన్నం పెట్టిన వారిని, అండగా నిలబడిన వారిని గుర్తుంచుకోవడం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. మనం ఎవరి నుంచి వచ్చామనేదీ గుర్తు ఉంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని కొనియాడే క్రమంలో పవన్ ఈ వ్యాఖ్యలు చెశారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పొట్టి శ్రీరాములు త్యాగం విలువ అర్థమైందన్న పవన్ కళ్యాణ్.. పొట్టి శ్రీరాములు కఠోర ఆమరణ నిరహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రం సిద్దించేలా చేసారన్నారు. అలాంటి మహానుభావుడు చనిపోతే ఆయన భౌతిక కాయం మోయడానికి కూడా నలుగురు లేని పరిస్థితి కలగడం బాధకరమని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్రం అంటూ కొనియాడారు. పొట్టి శ్రీరాములు త్యాగం ప్రతీ తరానికి గుర్తు ఉండాలనే ఉద్దేశంతో.. ఆ మహనీయుని వర్ధంతిని ఆత్మార్పణ దినంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 తీసుకువచ్చిందన్న పవన్ కళ్యాణ్.. అన్ని వర్గాలు సమగ్ర అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో దీనిని తెచ్చినట్లు చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 మీద ఎవరైనా విమర్శలు చేస్తే అది వారి విజ్ఞతకు వదిలేస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 అమలు చేసి లక్ష్యాలు సాధించడమే పొట్టి శ్రీరాములుకు మనం అందించే నిజమైన నివాళి అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పొట్టి శ్రీరాములు ఒక జాతికి, కులానికి నాయకుడు కాదని., ఆయన ఆంధ్ర జాతికి నాయకుడని అభివర్ణించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళి అర్పించాలంటే ఆర్యవైశ్య సమాజానికి వెళ్లే అవసరం లేకుండా ఆయనను గౌరవించుకోవాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa