రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కారణంగా గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో కొన్ని రైళ్లను రద్దు చేశారు. అలాగే మరికొన్ని రైలు సర్వీసులను దారి మళ్లించారు. గుంతకల్లు రైల్వే డీఆర్ఎం విజయకుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. పాణ్యం, బుగ్గనపల్లె, కృష్ణమ్మకోన రైల్వే లైన్లో డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా డిసెంబర్ 16 నుంచి 27 వరకూ కొన్ని రైళ్లను రద్దుచేశామని.. మరికొన్ని దారి మళ్లించామని ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా నంద్యాల మీదుగా వెళ్లే గుంటూరు - డోన్ రైలు (17228)ను పదిరోజుల పాటు రద్దు చేశారు. రేపటి నుంచి డిసెంబర్ 26 వరకు గుంటూరు- డోన్ రైలును రద్దు చేశారు. అలాగే డోన్- గుంటూరు రైలు (17227)ను డిసెంబర్ 27 వరకూ రద్దు చేశారు.
అలాగే పూరి- యశ్వంత్ పూర్ (22883) రైలును దారిమళ్లించారు. డిసెంబర్ 20వ తేదీ పూరి యశ్వంతపూర్ (22883) డోన్ మీదుగా కాకుండా నంద్యాల నుంచి యర్రగుంట్ల మీదుగా నడుస్తుందని రైలు అధికారులు తెలిపారు డిసెంబర్ 21న యశ్వంతపూర్-పూరి (22884) రైలును కూడా దారి మళ్లించినట్లు గుంతకల్లు రైల్వే అధికారులు తెలిపారు. డిసెంబర్ 18, 25 తేదీల్లో హౌరా-యశ్వంతపూర్ రైలు (22831) నంద్యాల, ఎర్రగుంట్ల, గుత్తి, అనంతరపురం మీదుగా దారి మళ్లించారు. అలాగే డిసెంబర్ 20న యశ్వంతపూర్-హౌరా రైలు ( 22832) కూడా డోన్ మీదుగా కాకుండా.. అనంతపురం, గుత్తి, ఎర్రగుంట్ల, నంద్యాల మీదుగా నడవనుంది.
వీటితో పాటుగా డబ్లింగ్ పనుల కారణంగా.. గుంటూరు-ఔరంగాబాద్ రైలు (17253), ఔరంగాబాద్-గుంటూరు రైలు (17254) ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలు ఆలస్యంగా నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. మార్పుల ప్రకారం తమ ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవాలని సూచించారు. మరోవైపు ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు పెద్దపీట వేసే భారతీయ రైల్వే.. శబరిమల యాత్రికుల కోసం కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా శబరిమలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa