ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వం సూపర్ స్కెచ్.. ఆ ప్రాంతాల రూపురేఖలే మారిపోతాయ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2024, 06:34 PM

దేశంలోనే పొడవైన తీరప్రాంతం ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ తర్వాత రెండో స్థానం.. 975 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఆంధ్రప్రదేశ్ సొంతం.. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాలతో పాటుగా అనేక చారిత్రక కట్టడాలకు ఆలవాలం ఏపీ. సుందరమైన బీచ్‌లు, అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఎన్నో.. ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్‍‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి వైపుగా నడిపించాలని భావిస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇదే అంశం మీద దృష్టిపెట్టినట్లు తెలిసింది. రాష్ట్రంలోని సుందర ప్రదేశాలను డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది.


ఈ మధ్యకాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది ఓ ట్రెండ్‌గా మారిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీల ద్వారా మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు సాధారణమైపోయింది. సెలబ్రిటీలు విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తుంటే.. మరికొంతమంది మనదేశంలోని రాజస్థాన్ వంటి చోట్ల వీటిని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఆంధ్రప్రదేశ్‌లోని సుందరమైన ప్రదేశాలను, ప్రాంతాలను ప్రీమియర్ వెడ్డింగ్ డెస్టినేషన్‌లుగా మార్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల ఏర్పాటు సహా ఇతరత్రా అభివృద్ధి పనులు చేపట్టి.. వాటిని ప్రీమియర్ వెడ్డింగ్ డెస్టినేషన్‌లుగా మార్చాలని ప్రణాళికలు రచిస్తోంది.


త్వరలోనే నూతన పర్యాటక విధానం తీసుకురానున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వెడ్డింగ్ మార్కెట్‌పైనా ఫోకస్ పెట్టింది. ప్రతి ఏటా సుమారుగా 80 లక్షల వివాహాలు జరుగుతుంటాయని అంచనా. ఆ లెక్కన వెడ్డింగ్ మార్కెట్ విలువ సుమారుగా 12 లక్షల కోట్ల వరకూ ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో ఉన్న సుందరమైన ప్రాంతాలను డెస్టినేషన్ కేంద్రాలుగా మలచాలని నిర్ణయించింది.


ఏపీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు వేదికలుగా మార్చేందుకు అనేక ప్రదేశాలు ఉన్నాయి. దీంతో ప్రీమియర్ వెడ్డింగ్ కోసం మరెక్కడికో వెళ్లే అవసరం లేకుండా.. మన రాష్ట్రంలోనే వీటిని నిర్వహించుకునేలా ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. అలాగే పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఏడేళ్లపాటు ఎస్జీఎస్టీ వందశాతం రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఏపీలో పురాతన ఆలయాలు, బీచ్‌లు, హిల్ స్టేషన్లు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, చారిత్రక స్థలాలు అనేకం ఉన్నాయి. వీటిని ప్రీమియర్ వెడ్డింగ్‌లకు డెస్టినేషన్ కేంద్రాలుగా మార్చనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa