ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చేయని దుర్మార్గుడు జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2024, 09:49 PM

విజన్ గురించి ప్రిజనరీకి ఏం తెలుస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దోచుకోవడం దాచుకోవడంలో వైసీపీ అధినేత జగన్ రెడ్డిని మించినోళ్లు లేరని విమర్శించారు. విజన్ 2020ని ఎగతాళి చేసినోళ్లే నేడు ఫలితాలు అనుభవిస్తున్నారని చెప్పారు. ఉద్యోగాల గురించి మాట్లాడే జగన్ సైబరాబాద్ చూసి తెలుసుకోవాలని అన్నారు.ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చేయని దుర్మార్గుడు జగన్ రెడ్డి అని విమర్శించారు. తండ్రి పాలనను వాడుకుని లక్ష కోట్లు దిగమింగిన ఘనత జగన్ రెడ్డిది అని మండిపడ్డారు. తన పాలనలో ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదేనని ఆరోపించారు. సీఎం చంద్రబాబు గురించి, విజన్ గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa