ప్రముఖ తబలా విద్యాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన సంగీతం అందించి ఆరు దశాబ్దాల పాటు ప్రపంచలోని సంగీత ప్రియులందరినీ మెస్మరైజ్ చేసిన ఈయన డిసెంబర్ 15వ తేదీన చనిపోయారు. చాలా రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న జాకీర్.. 73 ఏళ్ల వయసులో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో కన్నుమూశారు. జాకీర్ మృతి గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ.. ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన జాకీర్ హుస్సేన్.. తన తల్లికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే నేరుగా.. ఓ ప్రముఖ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తాను ప్రేమించిన అమ్మాయిని కలవడం దగ్గర నుంచి పెళ్లి, పిల్లల వరకు అన్నీ తెలిపారు. అలాగే తన సీక్రెట్ మ్యారేజీ గురించి కూడా చెప్పుకొచ్చారు. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తబలా అధికారిక శిక్షణ కోసం జాకీర్ హుస్సేన్ 70వ దశకంలో చివరలో కాలిఫోర్నియాలోని బే ఏరియాకు వెళ్లారు. అక్కడికి కతక్ నేర్చుకునేందుకు వచ్చిన ఆంటోనియా మిన్నెకోలాను చూసి తొలిచూపులోనే ఇష్టపడ్డారు. ఆమెతో మాట్లాండేందుకు చాలా సంకోచించాడు. కానీ ప్రేమ ముందు భయ ఓడిపోవడంతో.. వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఏడేళ్ల పాటు ప్రేమాయణం సాగించిన వీరు ఇరు కుటుంబ సభ్యులకు ప్రేమ విషయం చెప్పాలనుకున్నారు.
ఈక్రమంలోనే ఆంటోనియా.. జాకీర్తో ప్రేమ విషయాన్ని వారి ఇంట్లో తెలిపింది. కానీ ఆమె తండ్రి ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఒక వాయిద్య కారుడిని పెళ్లి చేసుకుంటే.. ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూతురుకు నచ్చజెప్పాడు. అయినా ఆమె వినలేదు. మరోవైపు జాకీర్ కూడా తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. అప్పటి వరకు వీరి కుటుంబంలో ఏ ఒక్కరు కూడా మతాంతర వివాహం చేసుకోకపోవడంతో.. తల్లి వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ తండ్రి మాత్రం వారి ప్రేమను అంగీకరించాడు. ఇక అప్పటి నుంచి జాకీర్ తల్లి.. అతనితో ఎక్కువగా మాట్లాడలేదు.
ఇరు కుటుంబాల్లో వారి ప్రేమను చెప్పిన జాకీర్, ఆంటోనియాలు ఆ తర్వాత కొంతకాలం డేటింగ్ చేశారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తల్లి ఎలాగూ ఒప్పుకోదని భావించి.. జాకీర్ తండ్రికి మాత్రమే విషయం చెప్పారు. అతను కూడా భార్యకు చెప్పకుండా వెళ్లి.. 1979లో ముస్లిం సంప్రదాయ పద్ధతిలో జాకీర్, ఆంటోనియాలకు పెళ్లి జరిపించాడు. ఆ తర్వాత ఆయనే తన భార్యకు నచ్చజెప్పారు. చివరకు ఆమె వారి పెళ్లిని అంగీకరించేలా చేశారు. అయితే జాకీర్ తల్లి ఆయనను కలిసి.. ఎలాగూ పెళ్లి చేసుకున్నారు కాబట్టి.. హాయిగా కలిసి జీవించడని చెప్పినట్లు ఓ నేషనల్ టెలివిజన్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్లకు జాకీర్ తల్లి ఆంటోనియాను కలవడం.. ఆమెను ఇష్టపడడం జరిగింది. ఆ తర్వాత నుంచి వారిద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. ఇలా హాయిగా వీరి కాపురం సాగగా.. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. వాళ్లే అనిసా ఖురేషి, ఇసాబెల్లా ఖురేషిలు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa