ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. అధిక పింఛన్ సంబంధిత వివరాల్ని అప్లోడ్ చేసేందుకు.. ఎంప్లాయర్స్కు (యజమానులు) మరికొంత సమయం ఇచ్చింది. జనవరి 31 వరకు గడువు పొడిగించింది. దీంతో 3 లక్షలకుపైగా దరఖాస్తులు ప్రాసెస్ చేసేందుకు వీలు కలగనుంది.
అధిక పెన్షన్కు సంబంధించి.. వివరాల్ని సమర్పించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఇప్పుడు మరికొంత గడువు ఇచ్చింది. ఉద్యోగుల వేతన వివరాలను అప్లోడ్ చేసేందుకు యాజమాన్యాలకు వచ్చే ఏడాది అంటే 2025 జనవరి 31 వరకు సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటికీ 3.1 లక్షల మందికిపైగా ఉద్యోగుల అధిక పింఛన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించింది. ఈ మేరకు 2025, డిసెంబర్ 18న ఈపీఎఫ్ఓ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. గడువు పొడిగించాలని.. చాలా వినతులు వచ్చాయని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
ఉద్యోగుల వేతన వివరాలు అప్లోడ్ చేసేందుకు ప్రస్తుత గడువును పొడిగించాలని.. ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయర్స్ అసోసియేషన్ నుంచి కార్మిక మంత్రిత్వ శాఖకు చాలా వినతులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎన్నో సార్లు గడువు పొడిగించారు. 2024, మే 31 నాటికే డెడ్లైన్ గడువు ముగిసినప్పటికీ.. వ్యాలిడేషన్ ఆఫ్ ఆప్షన్ లేదా జాయింట్ ఆప్షన్కు సంబంధించి ఇప్పటివరకు కూడా 3.1 లక్షల మేర అప్లికేషన్స్ ఎంప్లాయర్స్ దగ్గరే పెండింగ్లో ఉన్నట్లు గుర్తించింది. అందుకే.. గడువును తాజాగా 2025, జనవరి 31 కి పెంచుతున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈ క్రమంలోనే పెండింగ్ దరఖాస్తుల్ని వెంటనే పూర్తి చేసేందుకు.. ఇది లాస్ట్ ఛాన్స్ అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇక అధిక ఈపీఎస్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసిన ఈపీఎఫ్ సభ్యులు లేదా ఈపీఎస్ పెన్షనర్లు.. అంటే హైయర్ పెన్షన్ దరఖాస్తుదారులు తమ దరఖాస్తు స్థితి తెలుసుకునేందుకు ఇప్పటికే ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లో సదుపాయం ఉంది. ఈపీఎఫ్ మెంబర్స్ పోర్టల్ ఓపెన్ చేయగానే కుడి వైపు దిగువ భాగాన ఇంపార్టెంట్ లింక్స్లో ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఫర్ పెన్షన్ ఆన్ హైయర్ వేజెస్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్ ఎంచుకొని ముందుకెళ్లాలి.
ఇక్కడ దరఖాస్తు సంఖ్య (అక్నాలెడ్జ్మెంట్ నంబర్), లేదా యూఏఎన్ నంబర్ లేదా పీపీఓ నంబర్ ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేశాక.. ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ కోసం సెలక్ట్ చేసుకోవాలి. ఓటీపీ నమోదు చేసిన తర్వాత దరఖాస్తు స్థితి తెలస్తుంది. అక్కడ అధిక పెన్షన్ అప్లికేషన్ ఏ స్థాయిలో ఉంది. డిమాండ్ నోటీసు జారీ అయిందా లేదా.. ఇంకా పెండింగ్లోనే ఉందా అనేది అక్కడ తెలుసుకోవచ్చు. ఇంకా దరఖాస్తు స్థితి కింద ఆన్లైన్ కాలిక్యులేటర్ కనిపిస్తుంది. డిమాండ్ నోటీసులు జారీ అయిన వారికి మాత్రమే ఇది పనిచేస్తుంది.
ఆ కాలిక్యులేటర్లో ఉద్యోగి డేట్ ఆఫ్ బర్త్, ఈపీఎఫ్ చందా సర్వీస్లో చేరిన డేట్, ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయిన డేట్ నమోదు చేయాలి. ఇప్పటికే రిటైర్ అయిన వారికి ఇది ఉపయోగంగా ఉంది. 2014 సెప్టెంబర్ ఒకటో తేదీకి ముందు.. అంటే ఆగస్ట్ 31 నాటికి జీతం (మూలవేతనం ప్లస్ డీఏ నమోదు చేయాలి. తర్వాత.. రిటైర్మెంట్ చేసిన తేదీ నాటికి చివరి ఐదు సంవత్సరాల వేతన సగటు నమోదు చేయాల. ఈ వివరాలను బట్టి.. చేతికి వచ్చే పింఛన్ ఎంతో తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa