మూత్రవిసర్జన అనేది సహజమైన ప్రక్రియ. ఇది తరచుగా మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మన శరీరానికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ప్రక్రియ శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది. అయితే, నలుగురిలో ఉన్నప్పుడు, ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు, లేదా ఒళ్లు బద్ధకం వల్లో కొన్ని సార్లు మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటారు. అయితే, మీరు చేసే ఈ చిన్న పొరపాటు అనేక ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు.
మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటే కిడ్నీలపై ప్రభావం పడుతుంది. కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్లు, మూత్ర వ్యవస్థ దెబ్బతినడం వంటి అనేక సమస్యలు వస్తాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదముంది. ఇలా పదే పదే చేయడం వల్ల మూత్రంలో మంట, నొప్పి వంటి సమస్యలు రావచ్చు. మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటే వచ్చే ఆరోగ్య సమస్యలు గురించి నిపుణులు చెప్పారు. ఆ సమస్యలపై ఓ లుక్కేద్దాం.
కిడ్నీలో రాళ్లు..
సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు 6 నుంచి 8 సార్లు మూత్ర విసర్జన చేస్తాడు. ఇది శరీరం నుంచి కాల్షియం, ఆక్సలేట్ వంటి ఖనిజాల్ని తొలగించడంలో సాయపడుతుంది. ఈ ఖనిజాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడేలా చేస్తాయి. అయితే, ఎక్కువ సేపు మూత్రవిసర్జనను ఆపినప్పుడు ఇవి బయటకు పోకుండా కిడ్నీల్లో రాళ్లుగా మారాతయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో..తీవ్రమైన నొప్పి వచ్చే అవకాశం ఉంది.
మూత్ర ఇన్ఫెక్షన్..
మూత్రం శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మూత్రనాళం నుంచి బ్యాక్టీరియాను తొలగించడంలో సాయపడుతుంది. అదే మీరు మూత్రాన్ని బలవంతంగా ఆపుకున్నప్పుడు బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతాయి. ఇది యూటీఐ ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. ఇది సంక్రమణకు దారితీస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడుతున్న వ్యక్తులు, మహిళలు, నరాల సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మూత్రాన్ని బలవంతంగా ఆపుకోవడం డేంజర్ అని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
మూత్రాశయ పనితీరు నెమ్మదించడం..
మూత్రాశయం అనేది మూత్రాన్ని పట్టుకోవడానికి వ్యాకోచిస్తుంది. దానిని బయటకు పంపడానికి సంకోచిస్తుంది. అయితే, పదే పదే మీరు మూత్రాన్ని ఆపుకుంటే.. చాలా డేంజర్. మూత్రశయ పనితీరు దెబ్బతీస్తుంది.దీర్ఘకాలిక ఓవర్స్ట్రెచింగ్ మూత్రాశయ కండరాలను దెబ్బతీస్తుంది. దీంతో.. మూత్రపిండాల పనితీరు నెమ్మదిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కిడ్నీలపై ఒత్తిడి..
మీరు ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకున్నట్టైతే.. కచ్చితంగా మూత్రపిండాలు (కిడ్నీలపై)పై ఒత్తిడి పెరుగుతుంది. శరీరంలో కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. కిడ్నీలు రక్తం నుంచి టాక్సిన్లను ఫిల్టర్ చేయడానికి పనిచేస్తాయి. అదే మూత్రాశయం అధికంగా యూరిన్తో నిండినప్పుడు.. సరిగ్గా ఖాలీ కానప్పుడు.. అది మూత్రపిండాల్లోకి తిరిగి చేరుతుంది. దీంతో.. కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. దీంతో మూత్రాపిండాల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇతర సైడ్ ఎఫెక్ట్స్..
మూత్రాన్ని బలవంతంగా ఆపుకోవడం వల్ల పైలోనెఫ్రిటిస్ అనే పరిస్థితికి దారితీయవచ్చు. ఇది ఒక ఇన్ఫెక్షన్. ఈ వ్యాధికి త్వరగా చికిత్స చేయకపోతే.. మూత్రపిండాలకు దీర్ఘకాలిక నష్టం కలిగించవచ్చు. మూత్రాశయం పూర్తిగా ఖాళీ కానప్పుడు, మూత్రాశయం నుంచి బ్యాక్టీరియా మూత్రపిండాలకు చేరినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే యూరిన్ వచ్చినప్పుడు బలవంతగా ఆపుకోకుంటే.. వెంటనే మూత్ర విసర్జన చేయడం ఆరోగ్యానికి మంచిదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa