బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడు మ్యాచ్లు ముగిసే సమయానికి 1-1తో సమమైంది. తొలి టెస్టులో భారత్, రెండో టెస్టులో ఆస్ట్రేలియా గెలవగా.. మూడో టెస్టు వర్షం కారణంగా డ్రా అయింది. దీంతో చివరి రెండు టెస్టుల్లో ఎవరు సత్తాచాటుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్లో భాగంగా నాలుగో టెస్టు ఈనెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టుకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు. తన బ్యాటింగ్ పొజిషన్, గాయానికి సంబంధించి అప్డేట్స్ ఇచ్చాడు.
గాయంపై కీలక అప్డేట్..
ప్రాక్టీస్ సెషన్లో తన మోకాలికి గాయమైన అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. తనకు తగిలిన గాయం తీవ్రమైంది కాదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను బాగున్నానని వ్యాఖ్యానించాడు.
బ్యాటింగ్ పొజిషన్పై..
"ఎవరు ఎక్కడ బ్యాటింగ్ చేస్తారనే విషయంపై ఎక్కువగా ఆలోచించకండి. ఎప్పుడైనా.. కొన్ని విషయాలు మీడియాతో చెప్పాలి. మరికొన్ని చెప్పకూడదు. ఓవరాల్గా జట్టుకు ఏది మంచిదో అది మాత్రమే చేస్తాం. మిగతా విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు" అని రోహిత్ శర్మ వెల్లడించాడు.
కోహ్లీ ఫామ్ గురించి ఏమన్నాడంటే..
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి కూడా రోహిత్ శర్మ బదులిచ్చాడు. ఈ సిరీస్లో పెద్ద స్కోర్లు చేయలేకపోతున్న కోహ్లీ గురించి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చాడు. కోహ్లీ తప్పకుండా ఫామ్లోకి వస్తాడని, పరుగులు చేస్తాడని వ్యాఖ్యానించాడు. ఆధునిక క్రికెట్లో అతడు ఓ మేటి బ్యాటర్ అని ప్రశంసించాడు.
కాగా తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వడంతో రోహిత్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. కానీ ఓపెనింగ్లో రాహుల్, జైశ్వాల్లు రాణించడంతో 2, 3వ టెస్టుల్లో ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు రోహిత్. కానీ మూడు ఇన్నింగ్స్లలోనూ 10, 3, 6 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. దీంతో రోహిత్ మళ్లీ ఓపెనర్గా రావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి నాలుగో టెస్టులో రోహిత్ శర్మ ఏ స్థానంలో బ్యాటింగ్కు వస్తాడో..!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa