వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీలో వరుస షాక్లు తగులుతూ వస్తున్నాయి. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు వైసీపీని వీడారు. కూటమి పార్టీల్లో తమకు అనువైన పార్టీని ఎంచుకుని కండువా మార్చేస్తున్నారు. తాజాగా మరో నేత వైసీపీకి గుడ్ బై చెప్పారు. మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్అహ్మద్ వైసీపీని వీడారు. అలాగే రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. తన నిర్ణయానికి గల కారణాలను వివరిస్తూ ఇంతియాజ్ అహ్మద్ ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. 2024 ఏపీ ఎన్నికలకు ముందు ఇంతియాజ్ అహ్మద్ ఉద్యోగానికి వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ప్రజాసేవే ధ్యేయంగా, కర్నూలులోని పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఐఏఎస్ సర్వీస్ నుంచి వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చినట్లు ఇంతియాజ్ అహ్మద్ రాజీనామా లేఖలో ప్రస్తావించారు. అదే కారణంతో కర్నూలు నియోజకవర్గం నుంచి వైసీపీ తరుఫున పోటీ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు అందరికీ తెలిసిన విషయమేనన్న ఇంతియాజ్ అహ్మద్.. కొంతకాలంగా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అందరితో మాట్లాడిన తర్వాతనే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే తాను కేవలం రాజకీయాలకు మాత్రమే దూరమవుతున్నాను కానీ.. ప్రజాసేవకు కాదంటూ ఇంతియాజ్ అహ్మద్ వెల్లడించారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా, సామాజిక సృహ ఉన్న వ్యక్తిగా, సాహితీవేత్తగా మెరుగైన సమాజం కోసం కృషిచేస్తానని.. సామాజిక అసమానతలను, రుగ్మతలను రూపుమాసేందుకు, పర్యావరణ కాలుష్యం తగ్గించేందుకు స్వచ్ఛంద సంస్థలతో పనిచేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రెస్నోట్లో పేర్కొన్నారు. ఏపీ ఎన్నికలకు ముందు ఐఏఎస్ సర్వీసుకు ఇంతియాజ్ అహ్మద్ వీఆర్ఎస్ తీసుకున్నారు. వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుఫున పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేసిన టీజీ భరత్ విజయం సాధించారు. చంద్రబాబు మంత్రివర్గంలోనూ చోటు సంపాదించారు.
ఇక ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రాజకీయంగా సైలెంట్గా ఉన్న ఇంతియాజ్ అహ్మద్.. చివరకు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ నిర్ణయం తాత్కాలికమా.. మరో పార్టీలో చేరతారా అనేది చూడాల్సి ఉంది. అయితే ఎన్నికలకు ముందు వీఆర్ఎస్ ఇప్పించి మరీ వైఎస్ జగన్ ఈయనను బరిలో నిలిపారు. అలాంటి ఆయన పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండకుండా రాజీనామా చేయడం ఏమిటని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa