ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు మంగళవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కుప్పం ఆర్అండ్ బీ అతిథి గృహం నుండి బయల్దేరి ఉదయం10.00 గంటలకు కుప్పం తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు చేరుకుని జననాయకుడు సెంటర్ను ప్రారంభిస్తారు. తర్వాత అక్కడే ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం12.20 గంటలకు కంగుంది గ్రామం చేరుకుని కీర్తిశేషులు శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత 1.20 గంటలకు కుప్పంలోని ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వెళతారు. అనంతరం 2 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. 5.05 గంటలకు శాంతిపురం మండలం, కడపల్లి వద్ద నిర్మిస్తున్న సొంత ఇల్లు నిర్మాణాన్ని పరిశీలిస్తారు. 6.10 గంటలకు ద్రవిడ యూనివర్సిటీ చేరుకుని అకాడమిక్ బిల్డింగ్లోని ఐఎంఐబీ (1M1B కెరీర్ రెడీనెస్ సెంటర్)ను ప్రారంభిస్తారు. అనంతరం ద్రవిడ యూనివర్సిటీ లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రి 7.45 గంటలకు ఆర్అండ్ బీ అతిథి గృహంకు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం 8 గంటలకు చంద్రబాబు బయలుదేరి విజయవాడకు వెళ్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa