ఏపీలో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలు అందుబాటులో ఉండగా. మరో ఏడు చోట్ల కొత్త ఎయిర్పోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా మన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉండటం కూడా కలిసి వస్తోంది. ఈ క్రమంలోనే కొత్త ఎయిర్పోర్టుల ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.
ప్రతిపాదిత ఏడు ఎయిర్పోర్టులలో సీఎం నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం విమానాశ్రయం కూడా ఒకటి. కుప్పం ఎయిర్పోర్టును రెండు దశల్లో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. మొత్తం 1250 ఎకరాల్లో కుప్పం విమానాశ్రయం ఏర్పాటు కానుంది. మొదటి దశలో 683 ఎకరాల్లో కుప్పం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు చేపడతారు. రెండో ఫేజ్లో 567 ఎకరాల్లో అభివృద్ధి పనులు చేపడతారు. మొత్తంగా 1250 ఎకరాల్లో కుప్పం విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నారు. కుప్పం ఎయిర్ పోర్టు ద్వారా ఈ ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధి, అనుసంధానం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఇటీవల ఉండవల్లిలోని తన నివాసంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ఏడు కొత్త ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయాలని సూచించారు.
కుప్పంతో పాటుగా, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని- అన్నవరం, ఒంగోలులో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. కుప్పం ఎయిర్పోర్టుకు సంబంధించి ఫీజబులిటీ స్టడీ కూడా పూరైంది. 1250 ఎకరాల్లో కుప్పం విమానాశ్రయం నిర్మించాలని ప్రతిపాదించారు.
మరోవైపు మంగళవారం కుప్పంలో పర్యటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు.. కుప్పం విమానాశ్రయాన్ని ఎప్పటికి పూర్తి చేస్తామనే విషయంలోనూ కీలక ప్రకటన చేశారు. కుప్పం ఎయిర్పోర్టును 2027 ఆగస్టుకు పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే కుప్పంలో రెండు వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు, ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 2026 డిసెంబరు ఆఖరుకు కుప్పం బ్రాంచి కెనాల్కు నీటిని తెస్తామని కుప్పం వాసులకు మాటిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa