రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం పిఠాపురం పర్యటనకు రానున్నారు. నియోజకవర్గంలో పర్యటించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఉదయం 9.10 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వస్తారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన రాజానగరం, రంగంపేట, పెద్దాపురం, సామర్లకోట ఏడీబీ రోడ్డు మీదుగా ప్రయాణిస్తారు. దారిలో పలుచోట్ల రహదారి గుంతలను పరిశీలిస్తారు. ఇటీవల గేమ్ చెంజర్ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్కు వెళ్లి వస్తూ ఈ రహదారి గుంతల్లో పడి ఇద్దరు మృతి చెందిన నేపథ్యంలో పవన్ పరిశీలిస్తారు. 11.45 గంటలకు పిఠాపురం మండలం కుమారపురంకు వస్తారు. ఉపాధి హామీ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులాలకు ఆయన ప్రారంభోత్సవం చేస్తారు. 12.25 గంటలకు పిఠాపురం పాతబస్టాండ్ మునిసిపల్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలకు హాజరవుతారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 3.30 గంటలకు బయలుదేరి రాజమహేంద్రవరం ఎయర్ పోర్టుకు చేరుకుని.. అక్కడినుంచి మంగళగిరి క్యాంపు కార్యాలయానికి వెళతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa