రోజురోజుకూ దేశ వ్యాత్తంగా అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కడ చూసిన ఎవరో ఒకరు.. క్షణికావేశంలో అమాయక ప్రజల ప్రాణాలు తీస్తూనే ఉన్నారు. తాజాగా ఓ యువకుడు.. చిన్న కారణానికే తన సహోద్యోగిని చంపేశాడు. ఆఫీసు పార్కింగ్ ఏరియాలో అంతా చూస్తుండగానే.. కత్తితో నరికేశాడు. తీవ్ర గాయాల పాలైన ఆమె చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్రలోని పుణేకు చెందిన డబ్ల్యూఎస్ఎస్ గ్లోబల్ ఇంటర్నేషనల్ బీపీఓ కంపెనీలో 28 ఏళ్ల శుభదా శంకర్ అకౌంటెంట్గా పని చేస్తోంది. ఈక్రమంలోనే ఆమెకు అక్కడే పని చేస్తున్న కృష్ణ సత్యనారాయణ కన్నౌజ్ పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం కుదింరింది. అయితే వీరిద్దరూ మంచి స్నేహితులు కావడంతో.. అప్పుడప్పుడూ ఇద్దరూ తమ అవసరాల నిమిత్తం ఒకరి నుంచి మరొకరు అప్పులు తీసుకుంటూ ఉండేవారు. ఉన్నప్పుడు వాటిని తిరిగిచ్చేస్తూ స్నేహం కొనసాగించారు.
అయితే ఈ మధ్య మాత్రం వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా డబ్బు విషయంలోనే వీరిద్దరికీ మనస్పర్థలు వచ్చాయి. చాలా రోజులుగా వీరిద్దరూ సరిగ్గా మాట్లాడుకోవట్లేదు. ఈక్రమంలోనే కృష్ణ సత్యనారాయణ కన్నౌజ్.. శుభదా శంకర్పై విపరీతమైన కోపం పెంచుకున్నాడు. అయితే డిసెంబర్ 9వ తేదీ రోజు ఇద్దరూ ఆఫీసుకు వచ్చారు. ఉద్యోగం అయిపోయాక ఇంటికి వెళ్లేందుకు శుభదా శంకర్ పార్కింగ్ ఏరియాకు చేరుకుంది. అప్పుడే అక్కడికి కృష్ణ సత్యనారాయణ కన్నౌజ్ వచ్చాడు. ఆమెను మాట్లాడిచ్చాడు.
ఈఖ్రమంలోనే వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన కృష్ణ కన్నౌజ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో శుభదాపై దాడి చేశాడు. అక్కడే ఉన్న అనేక మంది ఈ విషయాన్ని గుర్తించినా చూస్తూ ఉండిపోయారు తప్ప దగ్గరకు రాలేదు. ఏమైనా అంటే అతడు తమపై కూడా దాడి చేస్తాడని భయపడిపోయారు. అయితే చాలా సేపు శుభదాను పొడిచిన తర్వాత కృష్ణ కన్నౌజ్ పక్కకు వచ్చి కత్తి కింద పడేశాడు. అప్పటి వరకూ చూస్తూ ఉన్న సహోద్యోగులంతా అతడిని పట్టుకుని దాడి చేశారు. ఆపై పోలీసులకు సమాచారం అందించి అతడిని వారికి అప్పగించారు.
అలాగే శుభదా శంకర్ను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర గాయాలు అయిన ఆమె కొన ఊపిరితో చికిత్స పొందతూ ఈరోజు మరణించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓసారి ఈ వీడియో చూసేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa