ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుంభమేళాలో రుద్రాక్షలు విక్రయిస్తున్న ఈ మహిళ అందానికి అందరూ ఫిదా

national |  Suryaa Desk  | Published : Fri, Jan 17, 2025, 08:16 PM

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు వెళ్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది బాబాలు, సన్యాసులు, సాధువులు అక్కడకు వెళ్తుండగా.. విదేశీయులు సైతం పుణ్య స్నానాల కోసం ప్రయాగ్‌రాజ్‌ చేరుకుంటున్నారు. అయితే ఇక్కడికి వచ్చే భక్తులకు అవసరపడే వస్తువులు అమ్ముతూ.. ఆ రాష్ట్ర ప్రజలు చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలాగే రుద్రాక్షలు అమ్ముతూ వ్యాపారం చేసుకుంటున్న ఓ మహిళ ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. ముఖ్యంగా ఆమె అద్భుతమైన కళ్లతో అందరినీ మాయ చేస్తోంది. మరి ఆమె ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఎక్కువ మంది ఆథ్యాత్మికత చింతనతోనే వెళ్తుంటారు. దేవుడిని దర్శించుకుని.. పవిత్ర గంగానదిలో పుణ్య స్నానం ఆచరించాలని చూస్తుంటారు. ఈక్రమంలోనే అనేక మంది ప్రసిద్ధ బాబాలు, సన్యాసులు అక్కడకు వస్తూ హైలెట్‌ అవుతుంటారు. కానీ అక్కడే ఉండి రుద్రాక్షలు అమ్ముకుంటున్న ఓ సాధారణ మహిళ.. కుంభమేళాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌ేగా నిలిచింది. ముఖ్యంగా తన అద్భుతమైన అందంతో అందరినీ కట్టిపడేస్తోంది.


 ప్రయాగ్‌రాజ్‌ వెళ్లిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్.. ఆమెను చూశాడు. వెంటనే ఆమెను వీడియో తీస్తూ.. అనేక ప్రశ్నలు అడిగాడు. పొడవాటి జుట్టు, సంప్రదాయ బట్టల్లో మెరుస్తున్న ఈ అమ్మాయికి... అందమైన పిల్లి కళ్లు ఉండగా.. మీరు చాలా బాగున్నారంటూ చెప్పాడు. డస్కీ స్కిన్‌తో ఎండలో మెరిసిపోతున్న ఈ ముద్దుగుమ్మ చుట్టూ అనేక మంది చేరడం చూసి మీ అందానికి ఫిదా అయ్యే వీరంతా వచ్చారంటూ వివరించాడు. ఆ తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారంటూ ఆమెని ప్రశ్నించగా.. నవ్వుతూనే ఇండోర్ నుంచి వచ్చినట్లు ఆమె సమాధానం చెప్పింది. ఆపై మీకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉందా అని అడగ్గా.. అదే చిరు నవ్వుతో ఉందని తెలిపింది.


అప్పుడే తన వద్దకు వచ్చిన ఓ కస్టరమ్.. ఓ నల్లరంగు రాయిని చూసి ఇదేంటని ప్రశ్నించగా.. ఉంగరంలో పెట్టుకునే రాయని చెబుతూనే తన పని తాను చేసుకుంటూ కనిపించింది. అక్కడకు వచ్చిన వారంతా తన వద్ద రుద్రాక్షలు కొనడం మానేసి ఆమె అందాన్ని చూస్తూ ఉండిపోతున్నారు. చాలా బాగున్నారని చెబుతూనే ఆమెతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఎవరేమన్నా సరే ఆమె మాత్రం చాలా హాయిగా నవ్వుతూనే సమాధానం చెప్పడంతో ఈ వీడియో నెట్టింట మరింత వైరల్ అయింది.


ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఆమె అందానికి ఫిదా అయిపోతున్నారు. ఈక్రమంలోనే చాలా అందమైన అమ్మాయిని కొందరు, డస్కీ బ్యూటీ అంటూ మరికొందరు తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా దేవలోకం దిగి వచ్చిన పార్వతీ దేవే నేరుగా రుద్రాక్షలు అమ్ముతుందని.. అక్కడకు వెళ్లిన వారంతా ఆమెను దర్శించుకోవాలంటూ ఓ నెటిజెన్ చెప్పుకొచ్చాడు. మరో నెటిజెన్ అయితే అందాన్ని ఎరగా వేసి సోషల్ మీడియాలో రచ్చ చేయకుండా.. నీతి, నిజాయితీతో వ్యాపారం చేసుకుంటున్న ఈమెకు అందరూ సపోర్ట్ చేయాలని చెప్పుకొచ్చాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa