బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం అందరికీ తెలిసిందే. భార్య, అమె కుటుంబ సభ్యులు వేధింపులు తాళలేకే అతుల్ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు.. 40 పేజీల సుధీర్ఘ సూసైడ్ నోట్ రాశాడు. అలాగే 80 నిమిషాల సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేశాడు. ఆపై తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా.. కేసు సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది.
అయితే కొన్నాళ్ల పాటు అతుల్ భార్య పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంది. కానీ చివరకు కోర్టులో హాజరైంది. ఆ తర్వాత నుంచి అతుల్ కుమారుడిని తమ కస్టడీలోకి అప్పగించాలంటూ అతడి తల్లిదండ్రులు కోరుతున్నారు. కానీ అతడి భార్య నిఖితా సింఘానియా స్పందించకపోవడంతో సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈక్రమంలోనే విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు బాలుడు అతడి తల్లి వద్దే ఉంటాడని వివరించింది. మీకు అప్పగించలేమంటూ చెప్పుకొచ్చింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
డిసెంబర్ 10వ తేదీన బెంగళూరు టెకీ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకంటే ముందు 24 పేజీల సుదీర్ఘమైన సూసైడ్ నోట్ రాశాడు. అలాగే 80 నిమిషాల వీడియోను రికార్డు చేసి.. తన భార్య నిఖితా సింఘానియా, అత్త, బావమరిది వేధించిన తీరును వివరించాడు. వారి వేధింపులు తాళలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని కూడా చెప్పాడు. ఈ సూసైడ్ నోట్, వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ఈ వార్త వెలుగులోకి వచ్చింది.
ముఖ్యంగా అతుల్ సుభాష్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి భార్య నిఖితా సింఘానియాను అరెస్ట్ చేసేందుకు పెద్ద ఎత్తునే ప్రయ్తనాలు చేశారు. కానీ నిఖితా సింఘానియా మాత్రం వేరే ఊరెళ్లి అక్కడే తలదాచుకుంది. చివరకు ఆమె బయటకు రాక తప్పలేదు. ఆ తర్వాతే పోలీసులు నిఖితా సింఘానియాను అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ఆమె తల్లి నిషా సింఘానియా, సోదరుడు అనురాగ్ సింఘానియాలను సైతం అదుపులోకి తీసుకున్నారు.
ఈక్రమంలోనే సుప్రీం కోర్టులో విచారణ సాగుతోంది. అయితే కోడలిని పోలీసుల అరెస్ట్ చేసినప్పటి నుంచి అతుల్ తల్లిదండ్రులు తమ మనవడి కోసం పరితపిస్తున్నారు. ఆ బాలుడిని ఎలాగైనా సరే తమకు అప్పగించాలని కోరుతున్నారు. ఇందులో భాగంగానే అతుల్ తల్లి మనవడిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ.. సుప్రీం కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఎస్ సీ శర్మ.. బాలుడు అతడి తల్లి వద్దే ఉంటాడని చెప్పారు.
ముఖ్యంగా వీడియో కాల్ ద్వారా బాలుడిని చూసిన న్యాయమూర్తులు.. అతడితో మాట్లాడారు. బాలుడి ఇష్టం మేరకే అతడు తల్లి వద్దే ఉంటాడని తీర్పునిచ్చారు. కేసుకు సంబంధించి మరికొన్ని ఆధారాలు సమర్పించేందుకు మరో వారం గడువు కావాలని బాలుడి నానన్మ తరఫు న్యాయవాది కోరగా.. సుప్రీ తిరస్కరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa