ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఉద్యోగ నియామక ప్రకటన జారీ చేసింది. కాంట్రాక్టు పద్ధతిలో ప్రాజెక్టు మేనేజర్ (01), సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ (01) పోస్టులకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఏపీఎస్డీఎంఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులు పంపుకోవడానికి చివరి తేదీ జనవరి 31. ఆ రోజు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. విద్యార్హతలు, ఇతర వివరాల కోసం https://apsdma.ap.gov.in/files/3521afe6f5095ae18e77c6d7eae37713.pdf వెబ్ లింకును అనుసరించాలని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఈ మేరకు పత్రికల్లోనూ ప్రకటన ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa