ఆ వృద్ధుడు చనిపోయాడుకున్నారు. అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తున్నారు. చివరి చూపు కోసం బంధువులంతా వచ్చారు. అయితే ఆ వృద్ధుడు లేచి కూర్చున్నాడు. అంతే.. కుటుంబీలు, బంధువులు ఒక్కసా రిగా నివ్వెరపోయారు. ఈ ఘటన జి.సిగడాం మండలంలో జరిగింది. సీతంపేట గ్రామానికి చెందిన ధర్మవరపు అప్పారావు అనే 85 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో ఇటీవల శ్రీకాకు ళం ఆసుత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఆరోగ్యం పూర్తిగా క్షీణిం చింది. దీంతో ఇక అప్పారావు బతికే అవ కాశం లేదని వైద్యులు చెప్పటంతో కుటుం బ సభ్యులు బుధవారం ఉదయం ఆంబులెన్స్ ద్వారా గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో అప్పారావులో కదలిక కనిపించక పోవడంతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు భావించారు. వెంటనే తమ బంధువులకు సమాచారం ఇవ్వటంతో పాటు అంత్యక్రియలకు అన్నీ సిద్ధం చేశారు. దీంతో గ్రామంలో ఉన్న వారు కట్టెలు, పూలదండలు, మేలతాళాలు రెడీ చేశారు. అంబులెన్స్ గ్రామంలోకి ఉదయం 10-30 గంటలకు చేరుకున్నారు. తర్వాత ఇంటి వద్ద మంచంపై పడుకోబె ట్టారు. అప్పారావు మృతి చెందాడని బందువులు, కుటుంబ సభ్యులు భోరున విలపించారు. పాడెకట్టి శ్మశానానికి తీసుకు వెళ్లటానికి సిద్ధం చేయగా అప్పారావు చిన్నగా కళ్లు తెరిచారు. మరో పది నిమి షాల్లో మంచంపై కూర్చోవటంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక అప్పారావుకు మరణం లేదని, మృత్యుంజయుడని అందరూ ఆనందం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa