మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు చుట్టూ 10 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని, మూడు ఏజెన్సీలతో డిటేల్ ప్రాజెక్ట్ రిపోర్టులు(డీపీఆర్) సిద్ధం చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం టెక్కలి సబ్కలెక్టర్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పోర్టు చుట్టూ ఉన్న భూముల వివరాలు, భూ సేకరణ అవకాశాలు, రోడ్డు, రైలు మార్గాలు, నీరు, విద్యుత్ సౌకర్యాలు తదితర వివరాలపై సంబంధిత ఏజెన్సీలు సర్వే చేస్తాయి. డ్రాప్ట్ ప్లాన్ తయారీ కోసం రెవెన్యూ అధికారుల బృందం సహకారం అందించనుంది. ప్రాజెక్ట్ డిటేల్ రిపోర్టుకు గాను మాస్టర్ ప్లాన్ తయారీలో భాగంగా మూడు ఏజెన్సీలు పోర్టు చుట్టుపక్కల పరిశీలిస్తాయి. ఆ ఏజెన్సీల ప్రతిపాదనల మేరకు ఈ ప్రాంతంలో ఎన్ని పరిశ్రమలు నెలకొల్పవచ్చు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు అన్నది గుర్తిస్తాం. ప్రస్తుతం సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు పరిధిలో 4,500 ఎకరాల ఉప్పు భూములు, ఈస్ట్కోస్ట్ పవర్ ప్లాంట్ వద్ద కొనుగోలు చేసిన సమీర్పేట లాజిస్టిక్ భూములు 2,100 ఎకరాలు, ఏపీఐఐసీ పరిధిలోని 1,300 ఎకరాలు, 900 ఎకరాల జిరాయతీ భూమి, 460 ఎకరాల ప్రభుత్వ భూములతో పాటు మరో 1,500 ఎకరాల ప్రైవేట్ భూములు అవసరమని ప్రాథమికంగా గుర్తించాం. ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధికి ఆసక్తి చూపుతుంది. శరవేగంగా డీపీఆర్, డ్రాప్ట్ప్లాన్ తయారు చేస్తున్నాం.’ అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa