జడ్జినంటూ మోసం చేసి యువతిని పెళ్లి చేసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ బుధవారం రాత్రి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భగవత్నగర్కు చెందిన నామాల నరేందర్ (33) ఇతను ఒక మ్యాట్రిమోనీకి తన బయోడేటా పంపించారు. తాను జడ్జినని తెలంగాణాలో పనిచేస్తున్నానని చెప్పి వివరాలు పెట్టాడు. ఏలూరు కొత్త పేటకు చెందిన సామంతుల నిర్మలకు 2019లో మేట్రిమోని ద్వారా అతను పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో పెళ్ళి చేసుకుంటానని నమ్మించాడు. అయితే అతను జడ్జి అని చెప్పడంతో ఇరువురు కుటుంబ సభ్యులు మాట్లాడుకుని 2022లో రూ.75 లక్షలు కట్నం అడగగా రూ.25 లక్షలు ఇచ్చి వివాహం చేశారు. కొంతకాలం ఖమ్మంలో కాపురం పెట్టారు. ఆ తరువాత అతను అప్పటికే పలువురికి కోర్టులలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసగిం చడంతో తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, ఉప్పల్, చాందానగర్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదు కావడంతో అతనిని అరెస్టు చేశారు. అంతేకాకుండా నిర్మలను రూ.50 లక్ష లు తీసుకురావాలని వేధింపులకు గురి చేస్తు న్నాడు. అతను జడ్జి కాదని తెలుసుకున్న నిర్మల గత నెల నవంబర్ 12న ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీఐ ఎం.సుబ్బారావు ఆధ్వర్యంలో ఎస్ఐ కాంతి ప్రియ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నామాల నరేందర్ పోలీసులకు చిక్కకుండా పరీరాలో ఉన్నాడు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నాడని గుర్తించి ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం రైలు ఆగిన వెంటనే అతనిని మహిళా ఎస్ఐ వి.కాంతిప్రియ అరెస్టు చేశారు. అతని వద్ద నకిలీ జడ్జి ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వివిధ రకాల చిరునామాలతో అతని దగ్గర కార్డులు ఉండడాన్ని గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa