రిమ్స్ ఆస్పత్రిపై వచ్చేనెల మొదటివారంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అధికారులను కోరారు. దాతల సహాయంతో ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మోటార్లు పనిచేయకపోవడంతో మద్దిపాడు, ఒంగోలు, కొత్తపట్నం మండలాల్లోని 50 గ్రామాలకు నీటి సరఫరాలో 17 రోజులపాటు సమస్య వచ్చిందన్నారు. ఒంగోలు నగర పరిధిలో వినియోగించకుండా ఉన్న ఇరిగేషన్ శాఖకు చెందిన 146 ఎకరాలను రెవెన్యూ శాఖకు బదలాయిస్తే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వవచ్చని తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa