ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూపీఎ్‌సకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో చేపట్టిన నిరసన విజయవంతం చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 04:58 PM

పాత పెన్షన్‌ కోసం పోరుబాటలో నిరసన కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్‌ కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ( ఏపీసీపీఎస్ఈఏ) పిలుపునిచ్చినట్టు అసోసియేషన్‌ రాష్ట్ర నాయకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ విధుల్లో చేరిన ఉద్యోగులందరూ యూపీఎస్‌ పరిధిలోకి వచ్చే విధంగా యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (యూపీఎస్ )ను అమలు చేస్తున్నట్టు మోదీ సర్కార్‌ ప్రకటించిందని తెలిపారు. యూపీఎ్‌సలో 100 శాతం ఉద్యోగి సొమ్ము ప్రభుత్వమే తీసుకుంటుందని, ప్రతినెలా 10 శాతం చొప్పున 30-40 సంవత్సరాలు సర్వీసు చేసిన ఉద్యోగి దాచుకున్న మొత్తాన్ని రిటైర్మెంట్‌ తరువాత ఇవ్వకుండా ప్రభుత్వమే తీసుకోవటం అత్యంత దారుణమని ఏపీసీపీఎ్‌సఈఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్‌, కరిమి నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇచ్చిన హామీ మేరకు సీపీఎ్‌స/జీపీఎస్‌ విధానానికి బదులుగా పాత పెన్షన్‌లో ఉన్న ప్రయోజనాలను కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. యూపీఎ్‌సకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన ఎన్‌ఎంఓపీఎ్‌సకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో సీపీఎస్‌ ఉద్యోగులు నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa