ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంజాయి నివారణకు ఈగల్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 04:59 PM

గంజాయి నివారణకు రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్‌ ఎలిట్‌ యాంటీ నార్కోటిక్‌ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. విశాఖ రేంజ్‌లో మొత్తం 39 వేల కేజీల గంజాయిని నిర్వీర్యం చేశామన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఈగల్‌’ కోసం ఐదుగురు కేబినేట్‌ మంత్రులతో కమిటీ నియమించారు. దీనికి ఐజీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు. ఎస్పీ, ఏఎస్పీలు బృందాలుగా పని చేస్తారు. సైబర్‌ నేరాలను నియంత్రించేందుకు ప్రతి జిల్లాలో సైబర్‌ క్రైం పోలీసు స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి డీఎస్పీ స్థాయి అధికారి ఎస్‌హెచ్‌వోగా ఉంటారు. చిన్నారులపై లైంగిక దాడుల కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. మావోయిస్టులు అలజడులు సృష్టిస్తే ఉపేక్షించేది లేదు. ఇప్పటికే 30 మంది మావోయిస్టుల్లో 13 మంది ఆ పార్టీని వీడారని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నాం. జిల్లాలో మార్చి 31 నాటికి లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామ’ని డీజీపీ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa