పలాస మండలం వీరభద్రాపురం గ్రామ సమీపంలో భారీ రక్తపింజరి పాములు కలకలం సృష్టించాయి. వీటిని కాశీబుగ్గ అటవీ శాఖ అధికారుల సమాచారంతో ఈస్ట్రన్ఘాట్స్ వైల్డ్లైఫ్ సొసైటీ సభ్యుడు ఓంకార్త్యాడి చాకచక్యంగా పట్టుకొని.. సమీప అడవుల్లో విడిచిపెట్టారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం రాత్రి గ్రామ శివారులోని పంట పొలాల్లో నిద్రించేందుకు రైతులు వెళ్లగా...సమీపంలోని కర్రల కింద భారీ శబ్దాలు వినిపించాయి. కర్రలు తొలగించి చూడగా ఏడు అడుగుల పొడవు ఉన్న భారీ రక్తపింజరి పాములు నాలుగు కనిపించాయి. వెంటనే వారు కాశీబుగ్గ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఓంకార్తో కూడిన అటవీ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఓ పాము గుట్టల్లోకి వెళ్లిపోవడంతో కనిపించలేదు. మిగిలిన మూడు పాములను అతికష్టం మీద పట్టుకొని సమీప అడవుల్లో విడిచిపెట్టారు. ఇవి అత్యంత విషపూరితమైనవని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa