ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏటీఎంలలో లక్షా 54 వేలు చోరీ

national |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2019, 08:07 PM

ఏటీఎంలలో నగదు చోరీ చేయడం అంత ఈజీ కాదనే సంగతి తెలిసిందే. అయితే, గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి చెమట పట్టకుండానే ఏటీఎం నుంచి దర్జాగా నగదు కాజేశాడు. అది కూడా జస్ట్ తన చేతి వేళ్లు ఉపయోగించి. ఏటీఎంలో లావాదేవీలను పరిశీలించిన బ్యాంక్ అధికారులకు లెక్కలో తేడా వస్తుండటంతో అనుమానం కలిగింది. కస్టమర్లు డ్రా చేయకుండానే ఏటీఎంల నుంచి నగదు ఎలా మాయమతుందో తెలియక జుట్టు పీక్కున్నారు. ఈ సందర్భంగా ఏటీఎంలో విత్ డ్రా చేస్తున్న తమ ఖాతాదారుల వివరాలు, ఫిర్యాదులను పరిశీలించిన అధికారులకు ఓ క్లూ దొరికింది. ఇటీవల ఓ వ్యక్తి ఏటీఎంలో కార్డుతో నగదు విత్‌డ్రా చేస్తున్నా నగదు రావడం లేదని ఫిర్యాదు చేశాడు. దీంతో బ్యాంకర్లకు అతనిపై అనుమానం కలిగింది. ఈ సందర్భంగా అతను ఏటీఎంకు వెళ్లిన రోజు సీసీటీవీ కెమేరాలో రికార్డైన వీడియో చూసి షాకయ్యారు. ఏటీఎం నుంచి నగదు బయటకు వచ్చే ట్రేలోకి నేరుగా వేళ్లను పోనిచ్చి చోరీ చేయడం కనిపించింది.


 


ఇలా అతను 11 సార్లు నగదు చోరీ చేశాడు. దశలవారీగా మొత్తం రూ.1.54 లక్షలు కాజేశాడు. దీంతో బ్యాంకర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్‌కు చెందిన హరేష్ పటేల్ యూనియన్ బ్యాంక్ ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేయడం కోసం కార్డు పెట్టేవాడు. ఆ తర్వాత ఏటీఎం నుంచి నగదు బయటకు రాకముందే వేళ్లను ట్రేలోకి పెట్టేవాడు. అలా వేళ్లకు అందిన నోట్లను బయటకు లాగి చల్లగా జారుకునేవాడు. అతను వేళ్లు పెట్టడం వల్ల నోట్లు బయటకు రాకుండా బ్లాక్ అయ్యేది. దీంతో అతని డెబిట్ కార్డు రికార్డుల్లో నగదు కట్ కాకుండా.. విత్‌డ్రా ఫెయిల్ అని వచ్చేది. దీనివల్ల హరేష్ ఖాతాలోని నగదు అలాగే ఉండేది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హరేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa