ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒడుదొడుకుల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు

business |  Suryaa Desk  | Published : Sat, Feb 01, 2025, 11:11 AM

 దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు  శనివారం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. కేంద్ర బడ్జెట్‌కు ముందు దేశీయ మార్కెట్లు అప్రమత్తత పాటిస్తున్నాయి.బడ్జెట్‌ నిర్ణయాలకు ముందు మదుపర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. మార్కెట్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 120 పాయింట్లు లాభంతో.. నిఫ్టీ 23,550 వద్ద ట్రేడింగ్‌ మొదలు పెట్టాయి.ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 31 పాయింట్ల లాభంతో 77,625 వద్ద.. నిఫ్టీ 26 పాయింట్లు పెరిగి 23,535 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, జొమాటో, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ హోటల్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టైటాన్‌, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.అమెరికన్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. నాస్‌డాక్‌ 0.86 శాతం, ఎస్‌అండ్‌పీ 500.. 0.50 శాతం, డౌజోన్స్‌ 0.75 శాతం నష్టపోయాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) లాస్ట్‌ ట్రేడింగ్‌ సెషన్‌లో నికరంగా రూ.1,189 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా.. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.2,232 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com