ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరణానంతరం అమెరికా మాజీ అధ్యక్షుడుకి గ్రామీ అవార్డు.

international |  Suryaa Desk  | Published : Mon, Feb 03, 2025, 09:24 PM

ప్రపంచ సంగీత రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఎంజెలెస్ వేదికగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతో మంది సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు హాజరై సందడి చేశారు. ఈక్రమంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు, శాంతి బహుమతి గ్రహీత జిమ్మీ కార్టర్ గ్రామీ అవార్డు లభించినట్లు ప్రకటించారు. మరణానంతరం ఆయనకు ఈ అవార్డు లభించగా.. ఆయన మనుమడు జేసన్ కార్టర్.. తాతకు వచ్చిన గ్రామీ అవార్డును అందుకున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి గ్రహీత జిమ్మీ కార్టర్ మరణానంతరం.. ఫిబ్రవరి 3వ తేదీన గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. ఆయన రచించిన "ది లాస్ట్ సండేస్ ఇన్ ప్లేన్స్"కు బెస్ట్ ఆడియో బుక్ నెరేషన్ బుక్ విభాగంలో అవార్డు లభించింది. అయితే జిమ్మీ కార్టర్ వందేళ్ల వయసులో గతేడాది డిసెంబర్ 30వ తేదీన కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే. చనిపోవడానికి ముందే ఆయనకు ఈ అవార్డు లభించి ఉంటే.. అతిపెద్ద వయసులోనే గ్రామీ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా రికార్డు సాధించేవారు.


ఎవరెవరిని ఓడించి గ్రామీ అవార్డు గెలుచుకున్నారంటే..?


బెస్ట్ ఆడియో బుక్ రేసులో ఇతర నామినీలు అయిన బార్ర్బా స్ట్రీసాండ్, జార్జ్ క్లింటన్, డాలీ పార్టన్‌లను ఓడించి.. జిమ్మీ కార్టర్ గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. మరణానంతరం గ్రామీ పురస్కారం లభించడంతో.. ఆయన మనుమడు జేసన్ కార్టర్ ఈ అవార్డును అందుకున్నారు. ఈక్రమంలోనే వేదికపై తన తాత గురించి మాట్లాడుతూ మురిసిపోయారు. తన తాతకు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. అలాగే ఈ ఆల్బమ్ కోసం పని చేసిన అందరికీ తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


2022లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న జిమ్మీ కార్టర్..!


జిమ్మీ కార్టర్ 199 నుంచి 1981 వరకు అమెరికా 39వ అధ్యక్షుడిగా పని చేశారు. తన పదవీ కాలంలో ప్రపంచ శాంతి కోసం ఎంతగానో కృషి చేశారు. ముఖ్యంగా 1979వ సంవత్సరంలో ఈజిప్ట్, ఇజ్రాయెల్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందానికి మధ్య వర్తిత్వం వహించి.. వారి సమస్యలకు పరిష్కారాన్ని చూపించారు. ఆ తర్వాత కూడా ప్రపంచ శాంతికి ఎంతగానో కృషి చేయగా.. 2022లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. తాజాగా గ్రామీ అవార్డు కూడా లభించడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com