ఐదు నిమిషాల పడక సుఖం కోసం అనేక మంది అమ్మాయిలు, అబ్బాయిలు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. తమ జీవితాలను తామే చేతులారా నాశనం చేసుకుంటూ.. అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారని అయిన వాళ్లని కూడా చంపేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది యూపీలో. అప్పటికే పెళ్లి ఇద్దరు పిల్లలున్న ఓ మహిళ.. మరో వ్యక్తితో ప్రేమలో పడింది. చాలా రోజులుగా అతడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
అయితే ఎప్పటిలాగే భర్త తాగే పాల్లలో నిద్ర మాత్రలు కలిపి.. అతడు స్పృహ తప్పగానే పక్కనే ఉన్న ప్రియుడి ఇంటికి వెళ్లింది. హాయిగా అతడితో కలిసి శృంగారంలో పాల్గొంది. అదే సమయంలో ప్రియుడిని హత్య కూడా చేసింది. అసలు ఈ మహిళ ప్రియుడినే ఎందుకు చంపాల్సి వచ్చింది, అది కూడా శృంగారంలో పాల్గొంటుండగా ఇంత దారుణానికి ఎలా పాల్పడిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర ప్రేదేశ్లోని రాయ్బరేలీకి చెందిన 32 ఏళ్ల మహిళకు చాలా కాలం క్రితమే పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే కొన్ని నెలల క్రితమే ఈమెకు చీరలపై డిజైన్లు వేసే ఇక్బాల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా, ఆపై వివాహేతర సంబంధంగా మారింది. రోజూ ఫోన్లు మాట్లాడుకుంటూ.. అప్పుడప్పుడూ తమ ఇంట్లోనే కలుస్తూ ఎంజాయ్ చేసేవాళ్లు. కానీ కొంత కాలంగా ఆమె తాను తప్పు చేస్తున్నట్లు గుర్తించింది. ఇకపై ఇలా చేయకూడదని నిర్ణయించుకుంది.
ఇదే విషయాన్ని ప్రియుడు ఇక్బాల్కు చెప్పగా.. అతడు మాత్రం ఆమెను వదులుకోవడానికి ఇష్ట పడలేదు. అదే విషయాన్ని చెప్పాడు. నా ప్రాణం పోయినా నిన్ను వదలను అంటూ వివరించాడు. మహిళ మాత్రం వద్దని బతిమాలగా.. ఇలాగే చేస్తే మనం మాట్లాడుకున్న ఫోన్ రికార్డింగులు, వీడియోలను నీ భర్తకు చూపిస్తానంటూ బెదిరించాడు. ఎక్కడ భర్తకు విషయం తెలుసి తన పరువు పోతుందోనని భావించిన ఆమె.. తనకు ఇష్టం లేకపోయినా ఇక్బాల్తో కలుస్తుంది.
అయితే ఇటీవలే ఇక్బాల్ తన భార్యా పిల్లలను పుట్టింటికి పంపించి.. ఎప్పటిలాగే నిద్ర మాత్రలు తీసుకుని వచ్చాడు. ప్రేయసికి ఇస్తూ నీ భర్తకి తాగించి ఇంటికి రమ్మని చెప్పాడు. ఆమె కూడా చేసేదేమీ లేక ఎప్పటిలాగే భర్త తాగే పాలల్లో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది. ఆపై అతడు స్పృహ తప్పగానే పక్కనే ఉన్న ప్రియుడి ఇంటికి వెళ్లింది. అయితే అప్పటికే మనసులో ఇక్బాల్తో బంధాన్ని ఎలాగైనా ముగించాలని, అందుకోసం అతడిని చంపడమో తాను చావడమో చేయడానికైనా వెనుకాడకూడదని నిర్ణయించుకుంది.
తన మనసులో ఈ ఆలోచనలు సాగుతుండగానే.. అవేమీ తెలియని ఇక్బాల్ ఆమెతో శృంగారంలో పాల్గొన్నాడు. అప్పుడే అతడు కింద ఉండగా.. పైకి ఎక్కి మరీ అతడి చేతులను కాళ్లతో అదిమి పట్టింది. ఆపై ఓ చేత్తో నోరూ మూసి మరో చేత్తో గొంతు పిసికి చంపేసింది. ఆపై ఏమీ తెలియనట్లుగా తన ఇంటికి వెళ్లిపోయింది. అయితే ఇక్బాల్ మృతిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈక్రమంలోనే ఇక్బాల్ ఫోన్ కాల్ లిస్టు, సీసీటీవీ ఫుటేజీలో మహిళ ఇంటికి రావడం గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ముందుగా మహిళ బుకాయించినా ఆ తర్వాత అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ముందు ఇష్టంతోనే అతడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నా ఇప్పుడు తనకది నచ్చలేదని.. ఎంత చెప్పినా అతడు తనను బెదిరిస్తూ శారీరకంగా వాడుకున్నాడని వివరించింది. అందుకే అతడిని చంపినట్లు ఒప్పుకుంది.