టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడికి నిరసన సెగ తగిలింది. పి. గన్నవరం నియోజకవర్గంలో బూత్ కన్వీనర్లకు దిశానిర్దేశం చేస్తున్న మంత్రిపై జనసైనికులు మండిపడ్డారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల్లో సీఎం చంద్రబాబు పేరును ప్రస్తావిస్తూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పవన్ లేకుండా ఎన్డీఏ లేదని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సభను తొందరగా ముగించి వెళ్లిపోయారు.
![]() |
![]() |