ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పనామా కాలువపై అమెరికాకు రాయితీ అంతా ఉత్తదే

international |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2025, 10:57 PM

అగ్రరాజ్యం అమెరికాకు చెందిన యుద్ధ నౌకలు.. పనామా కాలువపై నుంచి ప్రయాణిస్తే ఎలాంటి ఫీజును తీసుకోమని ఆ దేశం చెప్పిందంటూ యూఎస్ తాజాగా ప్రకటించింది. ముఖ్యంగా అమెరికా రక్షణ మంత్రి హెగ్సే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపగా.. ఇదంతా నిజమేనంటూ అమెరికా విదేశాంగ కూడా ధ్రువీకరించింది. కానీ దీనిపై తాజాగా పనామా కెనాల్ అథారిటీ స్పందించింది. అలాంటిదేమీ లేదని.. తామేమీ అమెరికాకు రాయితీ కల్పించలేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా టోల్ వ్యవస్థను బలోపేతం చేయడం, మార్పులు వంటివి తమ పరిధిలోకే వస్తాయని.. ఇప్పటి వరకు తాము ఎలాంటి సవరణలు చేయలేదంటూ షాక్ ఇచ్చింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


అమెరికా రక్షణ మంత్రి హెగ్సే ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ మరీ.. అమెరికా యుద్ధ నౌకలు పనామా కెనాల్‌పై ప్రయాణిస్తే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని వివరించింది. ఇందుకు ఆ దేశం కూడా ఒప్పుకుందని వెల్లడించింది. ఇది నిజమేనంటూ అమెరికా విదేశాంగ శాఖ కూడా క్లారిటీ ఇవ్వగా.. అంతా నిజమేనని భావించారు. కానీ తాజాగా ఇదంతా అబద్ధం అని.. పనామా కెనాల్ అథారిటీ తేల్చి చెప్పింది. పనామా అమెరికాతో ఎలాంటి ఒప్పందమూ చేసుకోలేదని వివరించింది.


ముఖ్యంగా పనామా కెనాల్ నిర్వహణ బాధ్యత తమవద్దే ఉంటుందని.. టోల్ వ్యవస్థను బలోపేతం చేయడం, మార్పులు వంటివన్ని తమ పరిధిలోకే వస్తాయని వెల్లడించింది. ఇప్పటి వరకు తాము పనామా కాలువకు సంబంధించిన ఎలాంటి సవరణలు చేయలేదని.. ముఖ్యంగా యూఎస్‌కు ఎలాంటి రాయితీ కల్పించలేదని ప్రకటించింది. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు అమెరికా ఇలా ఎందుకు చెప్పిందని ఆలోచిస్తున్నారు.


ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకం అయిన ఈ జల మార్గాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ఎన్నో ఏళ్లుగా కలలు కంటుకున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఈ విషయాన్ని తెలిపిన అతడు.. మరోసారి అధికారం చేతిలోకి రావడంతో కలను సాధించుకోవాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం 51 మైళ్లు (82 కిలో మీటర్లు) కల్గిన ఈ పనామా కాలువ అట్లాంటిక్-పసిఫిక్ సముద్రాల మధ్య దూరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.


అయితే ఈవారంలోనే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో లాటిన్ అమెరిగా దేశాల్లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగానే కెనాల్‌పై చైనా నియంత్రణల్లో తక్షణమే మార్పులు తీసుకు రావాలని ఒత్తిడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఆ దేశం చర్యలు తీసుకోకపోతే తామే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుందని కూడా అమెరికా భావిస్తున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే రూబియో పనామా అధ్యక్షుడు జాస్‌రౌల్‌తోపాటు కాలువ నిర్వాహకుడు రికార్టే వాస్క్వేజ్ మోరేల్స్‌ను కలిశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com