మోకాలి నొప్పి కారణంగా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఇంగ్లాండ్తో తొలి వన్డేకు దూరమైన విషయం తెలిసిందే. తొలి వన్డే మ్యాచ్కు ముందు రోజు ప్రాక్టీస్ చేస్తుండగా.. కోహ్లీకి గాయమైంది. అయితే, రెండో వన్డేకు ముందు భారత అభిమానులకు శుభవార్త అందింది. కోహ్లీ కోలుకున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకుని.. మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. ఈ విషయాన్ని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ వెల్లడించారు. రెండో వన్డేకు ముందు మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని చెప్పారు.
కటక్ వన్డేకు ముందు కోహ్లీ పూర్తి ఫిట్నెస్ సాధించాడని పేర్కొన్నారు. కటక్లో అతడు ప్రాక్టీస్ కూడా చేశాడని.. బాగా ప్రిపేర్ అయ్యాడని ఈ సందర్భంగా సితాన్షు కోటక్ చెప్పుకొచ్చారు. ఇక కోహ్లీ రాకతో జట్టు నుంచి ఎవర్ని తప్పిస్తారు? అనే విషయంపై కూడా ఆయన స్పందించారు. ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
కోహ్లీ ఖో చెప్పేది ఎవరికి?
తొలి వన్డేలో విరాట్ కోహ్లీ ఆడకపోవడంతో అతడి ప్లేసులో శ్రేయస్ అయ్యర్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో అతడు మెరుపు హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 36 బంతుల్లోనే 59 రన్స్ చేసి.. భారత్ ఈజీగా లక్ష్యాన్ని ఛేదించేలా పునాది వేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అతడిని జట్టు నుంచి తప్పించడం కష్టమే. దీంతో నాగ్పూర్ మ్యాచ్తో వన్డేల్లో అరంగేట్రం చేసిన యశస్వి జైశ్వాల్.. ఈ మ్యాచ్కు బెంచ్కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. దీనిపై మ్యాచ్ జరిగే రోజైన ఆదివారం క్లారిటీ రానుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్లో భారత్ ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో ఉంది.
రెండో వన్డేకు భారత తుది జట్టు అంచనా:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్/ వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ.
![]() |
![]() |