కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా జనగణన చేపట్టాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ డిమాండ్ చేశారు. సోమవారం రాజ్యసభ జీరో అవర్లో సోనియా మాట్లాడుతూ.. "జనగణన జరగకపోవడం వల్ల 14 కోట్ల మంది ప్రజలు జాతీయ ఆహార భద్రతాచట్టం ప్రయోజనాలు కోల్పోతున్నారు. 2011 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఇలా జరుగుతోంది. 140 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించాలనే యూపీఏ హయాంలో జాతీయ ఆహార భద్రతా చట్టం తెచ్చాం." అని అన్నారు.
![]() |
![]() |