ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెరువులో పడిప బాలికను కాపాడేందుకు వెళ్లిన నలుగురు సహా ఐదుగురు మృతి

Crime |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2025, 11:22 PM

గుజరాత్‌లోని పటాన్ జిల్లా చనాసమా తాలూకాలోని వడవాలి గ్రామానికి చెందిన 32 ఏళ్ల ఫిరోజా మాలెక్.. తన కుమారుడు 10 ఏళ్ల అబ్దుల్ మాలెక్, కుమార్తె 8 ఏళ్ల మెహ్రా మాలెక్‌లను తీసుకుని మేకలు మేపుకు వచ్చేందుకు వెళ్లింది. అయితే ఆదివారం రోజు(ఫిబ్రవరి 9వ తేదీ) సాయంత్రం 5.30 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలోనే ఫిరోజా మాలెక్ కుమార్తె మెహ్రా మాలెక్ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న చెరువులో పడిపోయింది. అయితే విషయం గుర్తించిన ఫిరోజా మాలెక్ వెంటనే కూతురిని కాపాడుకోవాలని చెరువులోకి దూకేసింది.


అయితే ఆమె కూడా నీళ్లలో మునిగిపోవడం గుర్తించిన ఆమె కుమారుడు అబ్దుల్ మాలెక్ సైతం నీళ్లలోకి దూకాడు. అయితే చెరువులో నీటి లోతు ఎక్కువగా ఉండడంతో ఈ ముగ్గురు అందులోనే మునిగిపోయారు. అయితే అక్కడే ఉన్న మరో ఇద్దరు పిల్లలు (14 ఏళ్ల సోహెల్ ఖురేషి, 12 సిమ్రాన్ సిపాహి)లు సైతం ఆ కుటుంబాన్ని కాపాడేందుకు చెరువులోకి దూకేశారు. కానీ ప్రమాదవశాత్తు వీళ్లు కూడా అందులో మునిగిపోయారు. ఇలా ఐదుగురూ అదే చెరువులో పడి ప్రణాలు కోల్పోయారు.


విషయం గుర్తించిన స్థానికులు గ్రామస్థులకు సమాచారం అందించగా.. హుటాహుటిన అందరూ అక్కడకు చేరుకున్నారు. అపై గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సైతం రంగ ప్రవేశం చేసి.. ఐదుగురి మృతదేహాలను చెరువులోంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం వీరి మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒక బాలికను కాపాడేందుకు వెళ్లిన నలుగురుతో పాటు మొత్తంగా ఐదుగురు చనిపోవడంతో గ్రామస్థులు అంతా కన్నీరుమున్నీరు అవుతున్నారు. సోమవారం రోజే వీరందరి అంత్యక్రియలు జరగనుండగా.. ఊరు ఊరంతా అక్కడే ఉండిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com