దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే నిఫ్టీ 23,100 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టగా.. సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 149 పాయింట్ల లాభంతో 76,201 వద్ద.. నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 23,030 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, మారుతీ సుజుకీ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్, సన్ఫార్మా, జొమాటో, ఏషియన్ పెయింట్స్, టైటాన్, అల్ట్రా టెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నష్టాల్లో కదలాడుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 86.85 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 75.16 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 2,957.70 డాలర్ల వద్ద కదలాడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa