రక్షణ, వాణిజ్యం, సాంకేతికత మరియు ఇంధనం వంటి ఉన్నత స్థాయి చర్చల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. చర్చలకు కూర్చునే ముందు అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీని హృదయపూర్వకంగా కౌగిలించుకుని స్వాగతించారు. ఫ్రాన్స్లో ప్రధాని మోదీ పర్యటన తర్వాత జరిగిన ఈ సమావేశం, భారతదేశంతో సహా అన్ని అమెరికా వాణిజ్య భాగస్వాములను లక్ష్యంగా చేసుకుని అధ్యక్షుడు ట్రంప్ కొత్త పరస్పర సుంకాల విధానాన్ని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత జరిగింది.అమెరికా పర్యటన భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ప్రధానితో పాటు విదేశాంగశాఖ మంత్రి జై శంకర్, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయనతో మోదీ భేటీ కావడం ఇదే మొదటిసారి. వైట్హౌస్లో జరిగిన ఈ సమావేశంలో టారిఫ్లు, వలసలు, భారత్-అమెరికా వ్యూహాత్మక అంశాలపై ఇరువురూ ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.భేటీ అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ఇరువురు నేతలూ మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. భారత్కు మోదీ లాంటి నాయకుడు ఉండటం గర్వకారణని అన్నారు. అంతేకాదు, తనకు మోదీ మంచి స్నేహితుడని, చాలా ఏళ్లుగా ఇరువురి మధ్య స్నేహం కొనసాగుతోందని, ఇది రాబోయే నాలుగేళ్లు కొనసాగిస్తామని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశానికీ లేనంతగా తమకు చమురు, గ్యాస్ వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అవి భారత్కు అవసరమని పేర్కొన్నారు.అలాగే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, బంగ్లాదేశ్ సంక్షోభం సహా పలు అంశాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఇరువురూ సమాధానం ఇచ్చారు. బంగ్లాదేశ్ సంక్షోభం వెనుక అమెరికా హస్తం ఉందన్న ఆరోపణలను ట్రంప్ కొట్టిపారేశారు. ఈ అంశం మోదీకి వదిలేస్తున్నానని తెలివిగా తప్పించుకున్నారు.మోదీ మాట్లాడుతూ.. శ్వేతసౌధంలో మళ్లీ ట్రంప్ను చూడటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భారతీయుల తరఫున ట్రంప్నకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు, దేశానికి సేవ చేయడానికి ప్రజలు తనకు మూడోసారి అవకాశమిచ్చారని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa