ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూ సమస్యలని త్వరగతిన పరిష్కరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2025, 02:16 PM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా భావిస్తున్న రీ-సర్వేతో గ్రామంలో భూ సమస్యలు పరిష్కరించాలని చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు సూచించారు. పంగులూరు మండలంలోని బైటమంజులూరు గ్రామంలో జరుగుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను గురువారం స్థానిక అధికారులతో కలసి పరిశీలించారు. రైతుల సహకారంతో రీ-సర్వే ప్రక్రియ న్యాయబద్ధంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా భూ రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశా రు. అనంతరం నూజెళ్లపల్లి గ్రామంలో ప్రజావేదిక ద్వారా అందిన భూ సమస్యను పరిశీలించారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్‌ సింగారావు, సర్వేయర్‌ సురేష్‌, శ్రీనివాసరావు, పలువురు సర్వేయర్లు, వీఆర్వోలు రైతులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa