అన్నమయ్య జిల్లాలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి ఘటనపై మంత్రి లోకేష్ స్పందించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించి అండగా నిలుస్తామని తెలిపారు. యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. యాసిడ్ బాధితురాలి తండ్రి జనార్ధన్కు మంత్రి లోకేష్ ఫోన్ చేశారు. బాధితురాలి ఆరోగ్యంపై వాకబు చేశారు. ‘‘చెల్లి కోలుకోవడానికి అత్యంత మెరుగైన వైద్యం అందిస్తాం. ఆమెను నా సొంత చెల్లిగా భావించి అండగా నిలుస్తా. యాసిడ్ దాడి ఘటన నన్ను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. దాడి చేసిన ఉన్మాదిని కఠినంగా శిక్షిస్తాం. అలాంటి సైకోలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. అధైర్య పడొద్దు, మీ వెంట నేనున్నాను’’ అని మంత్రి భరోసా ఇచ్చారు.
అక్కడే ఉన్న మంత్రి మండుపల్లి రాంప్రసాద్తో కూడా లోకేష్ మాట్లాడారు. గౌతమి కోలుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వైద్యానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి రాంప్రసాద్కు మంత్రి లోకేష్ సూచనలు చేశారు. ప్రేమించలేదనే కారణంగా యువతిపై ప్రేమోన్మాది యాసిడ్తో దాడికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. బ్యూటిషియన్గా చేస్తున్న గౌతమి అనే యువతిపై గౌతమ్ యాసిడ్తో దాడి చేశాడు. ముందుగా యువతికి బలవంతంగా యాసిడ్ తాగించిన ప్రేమోన్మాది.. ఆపై ఆమె మొహంపై యాసిడ్ పోశాడు. తీవ్రంగా గాయపడిన యువతిని మదనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగూరుకు తరలిస్తున్నారు కుటుంబసభ్యులు. కాగా.. యువతిపై యాసిడ్ దాడి చేసిన యువకుడు ప్రీప్లాన్డ్గా పురుగులు మందు తాగి మదనపల్లి ఆస్పత్రికిలో చేరాడు. దీంతో నిందితుడు తప్పించుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa