విజయ్ దళపతికి కేంద్ర హోంశాఖ వై ప్లస్ భద్రత కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై 11 మంది సాయుధ గార్డులు షిఫ్టుల వారీగా 24 గంటల పాటు హీరోకు భద్రత కల్పించబోతున్నారు. అసలు హీరోకు భద్రత కల్పించడానికి ప్రధాన కారణం ముప్పు పొంచి ఉండడమే. ఆయన రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడంతో పాటు.. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చురుకుగా రాజకీయాల్లో పాల్గొంటున్నారు. ఈక్రమంలోనే ఆయనకు ముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.
దీంతో కేంద్ర హోంశాఖ వై ప్లస్ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వై ప్లస్ భద్రత అంటే నాలుగో అత్యున్నత స్థాయి భద్రత. మొత్తం 11 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా 24 గంటల పాటు భద్రత కల్పిస్తారు. వీరిలో ఇద్దరి నుంచి నలుగురు కమాండోలు ఉండగా.. 7 నుంచి 9 మంది పోలీసులు ఉంటారు. అలాగే కాన్యాయ్లో ఒకటి లేదా రెండు వాహనాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ పద్ధతిలోనే హీరో విజయ్ దళపతికి భద్రత కల్పించింది సర్కారు.
తమిళ స్టార్ హీరో అయిన విజయ్ దళపతి 2024లో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా అదే ఏడాది తమిళ వెట్రి కజగం అనే పార్టీని కూడా స్థాపించారు. 2026లో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేస్తానని వెల్లడించారు. ఈక్రమంలోనే కచ్చితంగా విజయం సాధించాలనే ఉద్దేశంతో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం రోజు ఎన్నికల వ్యాహకర్త, జన్సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్తో సమావేశం అయ్యారు. అనేక విషయాలపై చర్చించుకున్న తర్వాత.. విజయ్ దళపతికి ఆయన ఎన్నికల వ్యూహకర్తగా ఉండబోతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా టీవీకే పార్టీకి ప్రత్యేక సలహాదారుగా కూడా వ్యవహరించబోతున్నట్లు ప్రకటించారు. ఈక్రమంలోనే సర్కారు ముందస్తు జాగ్రత్తగా ఆయనకు వై ప్లస్ భద్రత కల్పించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa