ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో రెండు విమానాల్లో ఇండియా రాబోతున్న అక్రమ వలసదారులు

national |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2025, 09:20 PM

అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారుల ఏరివేత కార్యక్రమం ప్రారంభం అయింది. ముఖ్యంగా యూఎస్‌లో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండేవాళ్లు, అక్రమ మార్గాల్లో అక్కడకు చేరుకున్న వారిని స్వదేశాలకు పంపిస్తోంది. ఇప్పటికే అనేక దేశాలకు చెందిన ప్రజలను తిరిగి వారి దేశాలకు చేర్చిన అమెరికా ఇటీవలే 104 మంది భారతీయులను సైతం ఇండియాకి చేర్చింది. అయితే తాజాగా మరో రెండు విమానాల ద్వారా పలువురిని ఇండియాకి తీసుకు వస్తోంది. ఆపూర్తి వివరాలు మీకోసం.


పది రోజుల క్రితమే 104 మందితో కూడిన అమెరికా సైనిక విమానం భారత్‌కు వచ్చింది. టెక్సాస్ నుంచి బయలు దేరిన అమెరికా ఆర్మీ విమానం సీ17 ఫిబ్రవరి 5వ తేదీన పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అయితే వీరందరి కాళ్లు, చేతులు కట్టేసి తీసుకురావడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అయితే భారత పౌరులను చెత్తకంటే హీనంగా చూశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ఇలా ఉండగా.. తాజాగా మరో రెండు విమానాలు రాబోతున్నట్లు తెలుస్తోంది.


119 మందితో భారతీయులతో కూడిన మొదటి విమానం ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 10.05 గంటలకు అమృతసర్‌లో ల్యాండ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. రెండో విమానం ఫిబ్రవరి 16వ తేదీన ల్యాండ్ కాబోతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ.. పౌర విమానయాన బ్యూరోకు లిఖిత పూర్వకంగా రాసిన లేఖలో తెలిపింది. మొదటి విమానంలో రాబోతున్న వాళ్లలో.. పంజాబ్‌కు చెందిన వారు 67 మంది ఉండగా.. హర్యానాకు చెందిన 33 మంది, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన 19 మంది ఉన్నట్లు సమాచారం.


ఈక్రమంలోనే విమానాశ్రయ అధికారులు సహా స్థానిక పరిపాలను అధికారులు అక్రమ వలసదారుల రాక కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారక ప్రకటన రాలేదు. అయితే ప్రస్తుతం యూఎస్ తరలిస్తున్న భారతీయులు డంకీ రూట్ సహా అనేక మార్గాల్లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినట్లు యూఎస్ సర్కారు చెబుతోంది. ఈ విమానాలు పంపడానికి ఒక్కరోజు ముందే అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ.. చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులు అందరినీ స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు. చూడాలి మరి రెండు విమానాల్లో కలిపి ఎంత మంది భారతీయులు ఇండియాకు వస్తున్నారనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa