అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో వైట్హౌస్లో భేటీ అయ్యారు. రెండోసారి ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఇదే మోదీ తొలి అమెరికా పర్యటన. ఈ నేపథ్యంలో ఇరువురి నేతల భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ట్రంప్, మోదీలు ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారం, ఒప్పందాల గురించి సమాలోచనలు చేశారు. అలాగే, భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఇక, సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘మాగా+మిగా = మెగా’ అంటూ భారత్ అమెరికా సంబంధాలకు కొత్త అర్ధం చెప్పారు.
డొనాల్డ్ ట్రంప్ నినాదమైన ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ ’నకు అనుగుణంగా.. భారత అభివృద్ధి లక్ష్యాన్ని ప్రతిబింబిస్తూ ‘మేక్ ఇండియా గ్రేట్ ఎగైన్’ అనే నినాదాన్ని ప్రస్తావించిన ప్రధాని.. శ్రేయస్సు కోసం ఇది మెగా భాగస్వామ్యంగా మారుతుందని చెప్పారు. భారత్ను మరింత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దే దిశగా పని చేస్తున్నామని పేర్కొన్నారు.
‘అధ్యక్షుడు ట్రంప్ నినాదం మాగా గురించి అమెరికన్లకు అవగాహన ఉంది.. చరిత్ర, అభివృద్ధిపై దృష్టిసారించిన భారతీయుల కూడా 2047 వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నారు.. అమెరికా భాషలో ఇది మేక్ ఇండియా గ్రేట్ ఎగైన్.. అమెరికా, భారత్ కలిస్తే ఈ MAGA ప్లస్ MIGA ఇరు దేశాల శ్రేయస్సు కోసం మెగా భాగస్వామ్యం’గా మారుతుంది’ అని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 మిలియన్ డాలర్లు తీసుకెళ్లాలని ఇరు దేశాలూ లక్ష్యంగా పెట్టుకున్నట్టు మోదీ, ట్రంప్ ప్రకటించారు. పరస్పర ప్రయోజన వాణిజ్యం ఒప్పందం కోసం తమ అధికార బృందాలు పనిచేస్తాయని, త్వరలోనే దీనిని ఖరారు చేస్తాయని అన్నారు.
కాగా, మీడియా సమాావేశంలో వీరికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీల్లో మెరుగ్గా బేరమాడేది ఎవరు..? అని ప్రశ్నించారు. దీనికి ట్రంప్ బదులిస్తూ.. ‘‘ఆ విషయంలో మోదీనే నాకంటే చాలా బెటర్.. బేరసారాలు సాగించగలరు. అందులో ఎలాంటి అనుమానం లేదు’ అని చెప్పడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa